ఆ మద్య తమిళ హీరో కార్తీతో ‘ఖాకీ’ సినిమా తీసిన దర్శకులు హెచ్.వినోద్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ సినిమా తర్వాత హెచ్.వినోద్ కి వరుసగా ఆఫర్లు రావడం మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో తమిళ టాప్ హీరో అజిత్, బాలీవుడ్ బడా నిర్మాత బోనీకపూర్ బ్యానర్లో ఓ సినిమా చేయనున్నాడన్న వార్త హాట్ టాపిక్గా మారింది.
ఈ సినిమాకు ‘ఖాకీ’ దర్శకులు హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. అయితే గతంలో శ్రీదేవి కుటుంబంతో అజిత్ కి మంచి రిలేషన్ షిప్ ఉంది. అందుకే శ్రీదేవి రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా ఇంగ్లీష్ వింగ్లీష్ లో అజిత్ అతిథిపాత్రలో నటించారు. ఈ సాన్నిహిత్యం మూలంగానే బోనికపూర్ బ్యానర్ లో అజిత్ సినిమా అంటూ వచ్చిన వార్తలకు బలం చేకూరింది.
ఈ వార్త కాస్త అజిత్ చెవిలో పడటంతో వెంటనే ఆయన టీమ్ స్పందించారు. అజిత్, బోనీకపూర్ బ్యానర్లో సినిమా తీస్తున్నారన్న వార్తలో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం అజిత్.. శివ దర్శకత్వంలో విశ్వాసం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా తరువాత చేయబోయే సినిమాను అజిత్ ఇంతవరకు నిర్ణయించలేదట. దీపావళి సీజన్లో విశ్వాసం సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అజిత్ విశ్వాసం సినిమాలో నటిస్తున్నారు.