తెలుగు ఇండస్ట్రీలో కుటుంబ తరహా చిత్రాలు తీయడంలో పెట్టింది పేరు దర్శకులు శేఖర్ కమ్ముల.  ఈయన తీసే ఈ చిత్రంలో ఎక్కడా అశ్లీలతకు చోటు ఉండదు..చక్కటి ప్రేమ, కుటుంబ వాతావరణంతో ఎలాంటి వాయిలెన్స్ లేకుండా ప్రశాంతంగా ఓ మంచి కాఫిలా ఉంటుంది. అందుకే శేఖర్ కమ్ముల తీసిన చిత్రాలు దాదాపు అన్నీ హిట్ గానే నిలిచాయి.  గత సంవత్సరం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాయిపల్లవి జంటగా నటించిన ‘ఫిదా’ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది.
Related image
కేవలం రూ.10 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం వెండితెరపై సూపర్ హిట్ టాక్‌తో ఏకంగా రూ. 50 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. అంతే కాదు ఈ చిత్రంలో నటించిన హీరోయిన్ సాయిపల్లవి.. రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ హోదాని సొంతం చేసుకోగా.. వరుణ్ తేజ్ కెరీర్‌లో బెస్ట్ హిట్‌గా నిలిచింది. ఫిదా చిత్రంలో సాయి పల్లవి అచ్చమైన తెలంగాణ యాస మాట్లాడంతో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. 
Related image
అమాయకంగా కనిపిస్తూ..చురుకైన పంచ్ డైలాగ్స్ తో ఈ చిత్రంలో సాయిపల్లవి చాలా అద్భుతంగా నటించింది.  తాజాగా ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఈ సినిమా ప్రసార హక్కుల్ని భారీ ధరకి కొనుగోలు చేసింది. గత ఏడాది నుంచి ఈ ఛానల్ ఫిదా సినిమాని ఐదుసార్లు ప్రసారం చేయగా.. అన్ని సందర్భాల్లోనూ టాప్ రేటింగ్స్ లభించింది. 
Related image
బుల్లితెరపై ఫిదా చిత్రం వస్తున్న సమయంలో  ప్రధాన ఛానళ్లు సైతం కొత్త సినిమాలను ప్రసారం చేసినా.. లాభం లేకపోయిందట. ఈ చిత్రం మొదట ప్రసారం అయినపుడు 1.3 టీవీ రేటింగ్ సాధించిన ఫిదా.. తాజాగా పోటీని తట్టుకుని 12.5 రేటింగ్ సాధించి ఛానల్‌ని అగ్రస్థానంలో నిలిపినట్లు సమాచారం.  మొత్తానికి ‘ఫిదా’ వెండితెరపైనే కాదు..బుల్లితెరపై కూడా రికార్డులు క్రియేట్ చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: