టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చారు.  వాస్తవానికి బాలనటుడిగా సినిమా తెరకు పరిచయం అయినా..రాజమౌళి దర్శకత్వంలో ‘స్టూడెంట్ నెంబర్ 1’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  ఇండస్ట్రీలో ఎన్టీఆర్ నటన, డ్యాన్స్, ఫైట్స్ లో ప్రత్యేకత ఉంటుంది.  ఎన్టీఆర్ డ్యాన్స్ చూసి ఎంతో మంది టాప్ హీరోలే తెగ మెచ్చుకున్నారు.  టెంపర్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ అదే పరంపర కొనసాగిస్తూ వస్తున్నాడు. 
Image result for trivikram srinivas ntr
ఎన్టీఆర్ జై లవకుశ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఒక రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కి సంభందించి త్రివిక్రమ్ ఇప్పటికే స్క్రిప్ట్ పనులను పూర్తి చేసుకొని ,ప్రస్తుతం నటీనటుల ఎంపిక ప్రక్రియలో బిజీగా వున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సరసన కథానాయికగా పూజా హెగ్డే ను తీసుకున్నారు.
Image result for pooja hegde
ఈ అవకాశం లభించడం పట్ల పూజా హెగ్డే ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది.  కాకపోతే ఈ పూజా హెగ్డే  ఇప్పుడు ఎన్టీఆర్ సరసన నటించాలంటే తెగ భయపడిపోతుందట..దానికి కారణం ఎన్టీఆర్ అద్భుతమైన నటన..డ్యాన్స్..మాత్రమే కాదు సింగిల్ టేక్ లో ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే ఇట్టే చెప్పేస్తాడట.
Image result for pooja hegde
ఈ విషయం తెలుసుకున్న పూజా హెగ్డే  ఆయన కాంబినేషన్లోని సీన్స్ ను తాను ఒకే ఒక్క టేక్ లో చేయగలనా .. లేదా? అనే భయం పట్టుకుందట. త్రివిక్రమ్ హెల్ప్ తీసుకుని ముందుగానే ప్రిపేరైపోవాలనే నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: