తెలుగు రియాల్టీ షోస్ లో జబర్దస్త్ కామెడీ షో నెంబర్ వన్ షో గ దూసుకుపోతుంది. ఈ షోతో ఇద్దరు హాట్ యాంకర్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అనసూయ, రష్మీ. మొదట్లో వీరిద్దరూ వెండితెరపై కనిపించినా పెద్దగా పట్టించుకోని జనాలు ‘జబర్ధస్త్’ కామెడీ షో తర్వాత ఈ ఇద్దరు ముద్దుగమ్మలకు పెద్ద ఫ్యాన్స్ అయ్యారు. తెలుగు ప్రేక్షకులకి వినోదం అందించడమే లక్ష్యంగ ఈ షో విజయవంతంగా ముందుకు సాగుతుంది . ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించేందుకు ప్రతి ఒక్క టీమ్ పోటీ పడుతున్నాయి.
అంతే కాదు ‘జబర్ధస్త్’ కామెడీ షో ఎంతో మంది ఔత్సాహికులకు పెద్ద వేదిక అయ్యింది. అంతే కాదు ‘జబర్ధస్త్’ కామెడీ షో బాగా పాపులర్ అయిన కొంత మంది కమెడియన్లు ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ కమెడియన్లు గా పేరు తెచ్చుకుంటున్నారు. ‘జబర్ధస్త్’ కామెడీ షో ఇప్పుడు వెంటనే గుర్తుకు వచ్చేది..హైపర్ ఆది. హైపర్ ఆది గ్యాప్ లేకుండగా ఎవరో ఒకరి మీద పంచ్ లు వేస్తూ నాన్ స్టాప్ గా నవ్విస్తూ ఉంటాడు.
అప్పుడప్పుడు కొన్ని కాంట్రవర్సీలు కూడా అవుతున్నాయి. తాజాగా రిలీజ్ అయిన జబర్దస్త్ ప్రోమో లో హైపర్ ఆది సిరియా వార్ మరియు ప్రియా ప్రకాష్ వారియర్ రెండిటిని కంపేర్ చేస్తూ పంచ్ వేసాడు. ఒక్కసారి ప్రే ఫర్ సిరియా వార్ అని చెప్పు ఒక్కరు కూడా రారు, అదే రన్ ఫర్ ప్రియా వారియర్ అని చెప్పు రోడ్లు మొత్తం నిండిపోతాయి అని సెటైర్స్ వేసాడు.
దాంతో జడ్జీలుగా ఉన్న నాగబాబు, రోజాలు కడుపుబ్బా నవ్వారు. వాస్తవానికి ఆ మద్య సిరియా వార్ జరిగి ఎన్నో ప్రాణాలు పోయిన దానికి సంభందించిన న్యూస్ ఎక్కడ చూపించలేదు. అదే ప్రియా ప్రకాష్ గురించి మాత్రమే 24 గంటల్లోనే ప్రపంచంలోనే పాపులర్ అయ్యింది.