వరస పరాజయాలతో సతమతమైపోతున్న మహేష్ కు తన లేటెస్ట్ మూవీ ‘భరత్ అనే నేను’ పై అనుమానాలు ఉన్నాయా అన్న సందేహాలు కలుగుతున్నాయి. దీనికి కారణం మహేష్ తన అత్యంత సన్నిహితులతో ఇస్తున్న లీకులు అని అంటున్నారు. ‘భరత్ అనే నేను’ మూవీ రిజల్ట్ లో తేడా వస్తే మహేష్ తాను ఒప్పుకున్న సినిమాలన్నీ పక్కకు పెట్టేసి ఒక ఏడాది గ్యాప్ తీసుకోవాలని అనుకుంటున్నాడు అంటూ కొందరు మహేష్ పై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. 
BHARATH ANE NENU LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న ఈ గాసిప్పులలో ఎన్ని నిజాలో తెలియకపోయినా ప్రస్తుతం హడావిడి చేస్తున్న ఈ వార్తలు విని నిర్మాత దిల్ రాజ్ టెన్షన్ పడుతున్నాడు అని వార్తలు వస్తున్నాయి. ‘భరత్ అనే నేను’ సినిమా తర్వాత మహేష్ చేయాల్సింది దిల్ రాజు బ్యానర్ లోనే అన్న విషయం తెలిసిందే. 
BHARATH ANE NENU LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి దర్శకుడు వంశీ పైడిపల్లి ఈమూవీ స్క్రిప్ట్ ను పూర్తి చేయడం అదేవిధంగా ఈసినిమాలో నటించబోయే ముఖ్య నటీనటుల ఎంపిక కూడ చాల వేగంగా జరిగిపోతోంది. పూజ హెగ్డేను మహేష్ పక్కన హీరోయిన్ గా ఫిక్స్ చేసిన వార్తలు కూడ వస్తున్నాయి. దీనితో అనుకోకుండా ‘భరత్ అనే నేను’ ఫెయిల్ అయితే వంశీ పైడిపల్లికి మళ్లీ నిరీక్షణ తప్పదా అన్న వార్తలు వస్తున్నాయి.
సంబంధిత చిత్రం
అయితే ఈ వార్తలు అన్నీ ఎవరో మహేష్ వ్యతిరేకులు చేస్తున్న నెగిటివ్ ప్రచారమని ‘భరత్ అనే నేను’ రిజల్ట్ తో మహేష్ దిల్ రాజ్ వంశీ పైడి పల్లిల సినిమా పై ఎటువంటి ఊహించని ట్విస్ట్ ఇవ్వడని అన్నీ అనుకున్నట్లుగానే జరుగుతాయని మహేష్ సన్నిహితులు అభిప్రాయ పడుతున్నారు. మహేష్ తాను నటించిన ఒక సినిమా ఫెయిల్ అయితే అతడు మళ్ళీ ఆ షాక్ నుండి కోలుకుని తిరిగి జనంలోకి రావడానికి చాల సమయం తీసుకుంటాడు కాబట్టి ఈ విషయాన్ని పసిగట్టిన కొందరు ఇటువంటి నెగిటివ్ ప్రచారం మహేష్ వంశీ పైడిపల్లిల సినిమా పై చేస్తున్నారు అనుకోవాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: