మహేష్ బాబు భరత్ అను నేను మూవీ తరువాత వంశి పైడిపల్లి డైరెక్షన్ చేసున్న సినిమా లో నటిస్తాడు దానికి దిల్ రాజు నిర్మాత. అయితే ఈ మూవీ రిజల్ట్ కూడా తేడాకొడితే గ్యాప్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఒప్పుకున్న సినిమాలన్నీ పక్కనపెట్టేసి, కనీసం ఏడాది గ్యాప్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడట మహేష్. మహేష్ నిర్ణయంతో దిల్ రాజు ఇరకాటంలో పడ్డాడు.
Image result for mahesh babu
ఎందుకంటే భరత్ అనే నేను సినిమా తర్వాత మహేష్ చేయాల్సింది దిల్ రాజు బ్యానర్ లోనే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, అశ్వనీదత్ కు ఓ సినిమా చేయాలి మహేష్. కానీ భరత్ అనే నేను సినిమా ఫలితంపైనే పైడిపల్లి మూవీ ఆధారపడి ఉంది. ఆ సినిమా సక్సెస్ అయితే ఓకే. లేదంటే వంశీ పైడిపల్లికి మళ్లీ నిరీక్షణ తప్పదు. కెరీర్ లో ఎన్ని ఫ్లాపులొచ్చినా గ్యాప్ మాత్రం తీసుకోలేదు మహేష్. ఒకే ఒక్కసారి అతడి కెరీర్ లో గ్యాప్ కనిపించింది. సైనికుడు, అతిథి సినిమాలు  బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ అయిన తర్వాత ఖలేజా సినిమా రావడానికి రెండున్నరేళ్లు టైం పట్టింది.
Image result for mahesh babu
ఈసారి కూడా సరిగ్గా అలాంటి గ్యాపే తీసుకోవాలనుకుంటున్నాడు మహేష్.  అయితే మహేష్ సన్నిహితులతో పాటు అతడి అభిమానులు మాత్రం గ్యాప్ తీసుకోడని చెబుతున్నారు. ఎందుకంటే దిల్ రాజు సినిమాకు సంబంధించి ఇప్పటికే అగ్రిమెంట్లు పూర్తయ్యాయి. హీరోయిన్ పూజా హెగ్డే డేట్స్ కూడా లాక్ చేశారు. మహేష్ కు అడ్వాన్స్ ఎమౌంట్ కుడా  అందిపోయింది. ఇలాంటి టైమ్ లో ఆ సినిమా నుంచి మహేష్ వెనక్కి తగ్గడని వాదిస్తున్నారు. కానీ గ్యాప్ తీసుకోవాలని మహేష్ నిర్ణయించుకుంటే ఇవేవీ అడ్డంకి కావు కదా. ఏదేమైనా భరత్ అనే నేను సినిమా పైనే ఇప్పుడు అందరి చూపు ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: