‘బాహుబలి’ తరువాత రాజమౌళి చరణ్ జూనియర్ లతో తీస్తున్న మల్టీస్టారర్ ఇంకా కనీసం ప్రారంభం కూడ కాకపోయినా ఈమల్టీ స్టారర్ కు ఏర్పడ్ద క్రేజ్ తో వస్తున్న డీల్స్ అత్యంత ఆశ్చర్యకరంగా మారుతున్నాయి. మొదట్లో ఈసినిమాను ఎటువంటి గ్రాఫిక్ ల హడావిడి లేకుండా కేవలం 100 కోట్ల సినిమాగా పూర్తి చేయాలని రాజమౌళి భావిస్తే బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న ఒత్తిడితో ఈమూవీ బడ్జెట్ అత్యంత భారీగా మారిపోవడమే కాకుండా ఈసినిమా నిర్మాణ పనిరోజులు సుమారు 250 రోజులకు చేరిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇలాంటి పరిస్థుతులలో ఈమూవీ షూటింగ్ ఇంకా ప్రారంభం కాకపోయినా ఈ మూవీ ప్రమోషన్ కు సంబంధించిన వ్యవహారాలను చూడమని రాజమౌళి మార్చింగ్ యాంట్స్  అనే ఒక ముంబైకి చెందిన ఒక ప్రముఖ కంపెనీకి బాధ్యతలు అప్పచెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. భారీ సినిమాలకు సంబంధించిన ప్రమోషన్ విషయంలో అత్యంత సమర్థవంతంగా తమ బాధ్యతలను ఈ  కంపెనీ నిర్వహిస్తుంది అన్న టాక్ ఉంది.
RAJAMOULI MALTI STARER PHOTOS కోసం చిత్ర ఫలితం
సినిమా ఫస్ట్ లుక్ డిజైన్ చేయడం దగ్గర నుండి అన్ని విషయాలు అత్యంత సమర్ధవంతంగా నిర్వహిస్తారు అన్న పేరు మార్చింగ్ యాంట్స్ కంపెనీకి ఉంది. రాజమౌళి మల్టీ స్టారర్ కు సంబంధించిన ప్రమోషన్ బాధ్యత అంతా ఈమల్టీ నేషనల్ కంపెనీకి అప్పచెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. వీళ్ళే రామ్ చరణ్ ను మరియు ఎన్టీఆర్ ని లాస్ ఏంజెల్స్ కు తీసుకువెళ్లి ఫోటోషూట్ చేయించారని తెలుస్తోంది. 
RAJAMOULI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈమూవీకి సంబంధించిన హీరోయిన్స్ కూడా ఫిక్స్ అయిన తరువాత వారిని కూడ ఈ సంస్థ అమెరికాకు తీసుకువెళ్ళి ఒక ప్రత్యేకమైన ఫోటో షూట్ ను చేయిస్తుందని సమాచారం. ఆ తరువాత ఈమూవీలో హీరోలుగా నటిస్తున్న జూనియర్ చరణ్ ల లుక్ తో ఒక ఫస్ట్ లుక్ ని ఈసినిమా షూటింగ్ మొదలు పెట్టే రోజునే విడుదల చేసి ఈ మూవీకి భారీ హైక్ తీసుకు రావడానికి ఈ సంస్థ భారీ ప్రణాళికలు రచిస్తున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: