టాలీవుడ్ లో ఈ మద్య కమెడియన్లు బాగా రాణిస్తున్నారు.  ఎవరూ ఎవరికీ పోటీ లేకుండా టాలీవుడ్ లోనే ఎక్కువ కమెడియన్లు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.  ఇండస్ట్రీలో టాప్ కమెడియన్లు గా పేరు తెచ్చుకున్న ఆలి, బ్రహ్మానందం, వేణుమాదవ్ లాంటి సీనియర్ నటులు జోరు కాస్త తగ్గింది.  ఈ నేపథ్యంలో హాస్యనటుడు వెన్నెల కిశోర్, జబర్థస్ద్ లో నటించిన కొంత మంది కమెడియన్లు మంచి ఫామ్ లో కొనసాగుతున్నారు. 
Image result for vennela kishore
ఇక వెన్నెల కిషోర్ అయితే గతంలో బ్రహ్మానందం పలికించిన హావభావాలు పండిస్తూ..ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు.  అయితే వెన్నెల కిషోర్ సోషల్ మాద్యమాల్లో యాక్టీవ్ గా ఉంటారు.  తాజాగా వెన్నెల కిశోర్ తాజాగా ట్విట్టర్‌లో ఫన్నీగా తన అల్పాహార విశేషాలను పోస్ట్ చేసి  అందరినీ కడుపుబ్బా నవ్వించాడు. తన బ్రేక్‌ ఫాస్ట్ ఇది మాత్రమేనని, 15 నిమిషాల తరువాత రెండు ఇడ్లీలు తిని, ఆ వెంటనే కొంచెం పొంగల్‌, రెండు ఆనియన్‌ దోశలు ఆనియన్లు లేకుండా తింటానని పేర్కొన్నాడు.
Image result for vennela kishore
అనంతరం ఒక టీ మాత్రం స్నాక్స్‌ లా తీసుకుంటాని నవ్వించాడు. ఈ ట్వీట్ పై మంచు లక్ష్మి కూడా స్పందించి తన జీవితంలో ప్రతిరోజు ఆనందానికి వెన్నె కిశోర్‌ కూడా ఓ కారణమని అన్నాడు. వెన్నెల కిశోర్ టాలీవుడ్ లో దాదాపు అందరు అగ్రహీరోలతోనూ నటించిన విషయం తెలిసిందే. ఆయన చేసిన ఈ ట్వీట్ నెటిజన్లను అలరిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: