గత ఐదు సంవత్సరాల నుండి ఎక్కడా తగ్గకుండా రోజురోజుకి ప్రజలలో మమేకమవుతూ, ప్రతి ఒక్కరికీ వినోదాన్ని పంచిపెడుతున్న ప్రముఖ కామెడీ కార్యక్రమం జబర్ధస్త్. ఒక ప్రముఖ వినోదాత్మక ఛానెల్ లో వస్తున్న ఈ కార్యక్రమం ప్రతి గురు, శుక్ర వారాల్లో ప్రసారమవుతూ ఒక గంటన్నర పాటు ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్విస్తుంది.


ఇక ఈ షోలో చేసే ఎంతోమంది హాస్య కళాకారులు ప్రస్తుతం సెలబ్రిటీ స్టేటస్ ను అనుభవిస్తున్నారు. అయితే ఈ షోతో నాగబాబు, రోజా లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించడం షోకు మరికొంత ఫేమ్ ను జోడించిందని చెప్పొచు. కాగా ఉగాది సందర్భంగా ఈ షో ప్రసారమవుతున్న ఛానెల్లో జబర్దస్త్ లో ఉన్న అందరితోపాటు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కూడా పాల్గొని అహనా పెళ్ళంట అనే ప్రత్యేక ప్రోగ్రామ్ చేశారు.


కాగా ఇందులో రోజా పై నాగబాబు, శేఖర్ మాస్టర్ లు చేసిన కామెంట్స్ వివాదాలకు దారితీశాయి. రోజాను ఉద్దేశించి నాగబాబు ఎవరీ ఫిగర్ కత్తిలాగుందని  కామెంట్ చేశాడు. దీనికి ప్రతిగా అవును నాగబాబు గారు రోజాగారు రోజురోజుకి కత్తిలాగా తయారవుతున్నారని శేఖర్ మాస్టర్ అన్నాడు. ఇది వారు వినోదాత్మకంగానే అన్నప్పటికీ ఒక శాసనసభ్యురాలి హోదాలో ఉన్న అమెపై ఇలాంటి కామెంట్లు చేయడం తగదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వాఖ్యలు ఇంకెంత వివాదలకు దారితీస్తుందో చూడాలి!


మరింత సమాచారం తెలుసుకోండి: