తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో విలక్షణమైన పాత్రల్లో నటించి మెప్పించారు మంచు మోహన్ బాబు. సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అలనాటి మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో నటించి షెభాష్ అనిపించుకున్నారు. హీరో, విలన్, కామెడీ లాంటి పాత్రల్లో నటించి మెప్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది.
నటుడు, నిర్మాత, రాజకీయ వేత్త. 573 సినిమాల్లో నటించాడు. 72 సినిమాలు నిర్మించారు మోహన్ బాబు. ప్రస్తుతం ఆయన వారసులు మంచు విష్ణు, మంచు మనోజ్ లు హీరోలుగా రాణిస్తున్నారు. ఆయన కూతురు మంచు లక్ష్మి నటిగా, బుల్లితెర యాంకర్ గా తన సత్తా చాటుతున్నారు. మోహన్ బాబు అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మోహన్ బాబు గా పేరు మార్చుకున్నారు. దర్శకరత్న దాసరి నారాయణ రావు ఆయనకు గాడ్ ఫాదర్ గా వ్యవహరించారు..వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కాయి.
ఇక నటసార్వభౌములు ఎన్టీఆర్ తో ఎంతో అనుబంధం ఉంది. విలక్షణ నటుడు మోహన్బాబు రేపు 68వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన తన అభిమానులకు, శ్రేయోభిలాషులకు సోషల్ మీడియా ద్వారా ఓ సందేశమిచ్చారు. పుష్పగుచ్ఛాలు, పూల మాలలు తన కోసం తీసుకురావొద్దని ఆయన ట్వీట్ చేశారు.
అంతే కాదు వాటికి బదులుగా మొక్కలను తీసుకురావాలని సూచించారు. ఈ కానుక తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని ఆయన చెప్పారు. పర్యావరణాన్ని కాపాడటానికి ఆయన తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.