మెగా పవర్ స్టార్ రాం చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా రంగస్థలం. ఈ నెల 30న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో ఉగాది సందర్భంగా నిన్న సాయంత్రం వేల కొద్ది ఫ్యాన్స్ మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ స్పీచ్ హైలెట్ గా నిలిచింది.


సుకుమార్ మైక్ అందుకుని.. చిరంజీవి గురించి మాట్లాడటం మొదలు పెట్టాడు. ఇది చెబుతున్నందుకు నన్ను తప్పుగా అనుకోవద్దని చెప్పి. చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చేప్పుడు దేవి శ్రీ ప్రసాద్ తాను మాట్లాడుకున్నామని. ఆయనకు సిఎం పోస్ట్ కన్నా చిరంజీవి పోస్టే పెద్దది కదా మరి ఆయన ఎందుకు పాలిటిక్స్ లోకి వస్తున్నారని అనుకున్నామని అన్నారు.


అభిమాన నటుడు చిరంజీవి అంటూ ఇక చరణ్ కూడా ఈ సినిమాతో నచ్చేశాడని. ఏదైనా సరే స్వార్ధం లేకుండా చూపించే వ్యక్తి చరణ్. సినిమాలో తాను బాగా నటించాడు. చిట్టిబాబు సౌండ్ ఇంజినీర్ అన్న సీన్ మొదటి షాట్ లో ఓకే చేసి అందరు క్లాప్స్ కొట్టేలా చేశాడని అన్నారు. 


సినిమాకు పనిచేసిన టెక్నిషియన్స్ అందరి గురించి ప్రస్థావించి సినిమా తప్పకుండా మెగా ఫ్యాన్స్ నచ్చేలా ఉంటుందని అన్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. మరి రంగస్థలం హంగామా ఏంటో చూడాలంటె రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: