మెగాపవర్ స్టార్ రామ్చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమా ట్రైలర్ ఫస్ట్ లుక్లోనే అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ థియేట్రికల్ ట్రైలర్ చూసిన ప్రతిఒక్కరూ రామ్చరణ్ నటన గురించి ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు. నటనకు స్కోప్ ఉన్న పాత్ర ఇన్నాళ్లకు చెర్రీకి దక్కడంతో నట విశ్వరూపం చూపించాడని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.
నిన్న జరిగిన ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో..మెగాస్టార్ చిరంజీవి పుత్రోత్సాహంతో ఎమెషనల్ గా ఈ సినిమాకు సంబంధించిన ట్విస్ట్ బయట పెట్టడంతో సుక్కు టీమ్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఈ వేడుకకు మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ..రాంచరణ్ నటనతో అద్భుతం సృష్టించాడని అన్నారు.
ఇక సినిమా ట్రైలర్ చూస్తుంటే..రాంచరణ్ కి ఆది పినిశెట్టి చరణ్ కి అన్నయ్యగా నటిస్తున్నాడని, విలన్ గా ప్రెసిడెంట్ పాత్రలో జగపతి బాబు కనిపించనున్నాడని క్లియర్ గా తెలిసిపోయింది. అయితే చిరంజీవి ‘రంగస్థలం’ సినిమా గురించి మాట్లాడుతూ..ఫ్లో లో..చరణ్ నటన గురించి మాట్లాడుతూ..క్లైమాక్స్ లో ఆది పినిశెట్టి చనిపోయాక..చరణ్ చేసిన నటన హృదయానికి హత్తుకుందని చెప్తూ పొరపాటున ఈ ట్విస్ట్ ను బయటపెట్టేశాడు.
చిరు ఈ విషయాన్ని చరణ్ కనబర్చిన నటన గురించి ఎంతో ఆనందంతో మాట్లాడుతూ చెప్పిందే కానీ వేరే ఉద్దేశంతో కాదు. ఏది ఏమైనా..సినిమాలో ఆ ఎమోషన్ జర్నీ పర్ఫెక్ట్ గా ఉంటే ఈ ట్విస్ట్ ఏమాత్రం చూపించదని చిత్ర యూనిట్ సర్ధుకు పోయినట్లు తెలుస్తుంది.