ఇంటలిజెంట్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించి విడుదలవడానికి సిద్ధంగా ఉన్న సినిమా రంగస్థలం. ఈ సినిమా మీద రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి.1985 లోని విలేజ్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో నిర్మితమయిన ఈ సినిమాలో చరణ్ ఒక చెవిటివాడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. 


కాగా ఈ సినిమాకు సంబంధించి నిడివి విషయంలో రామ్ చరణ్ రాజీపడటంలేదని ఫిలిం నగర్ కోడైకూస్తోంది. రంగస్థలం సినిమా మొత్తం రెండుగంటల నలభైఐదు నిమిషాలు ఉందట. ఈ కాలం విలేజ్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంతో ఇంత నిడివితో జనాల్లోకి వెళితే తగినంత  రెస్పాన్స్ రాదు అని చిరంజీవి చిత్రబృందానికి సూచించినట్లు సమాచారం.


అయితే ఈ కాలం ఇలాంటి కథతోఎవరూ ముందుకు రాలేదు కాబట్టి మొదట మనకు పెద్ద విజయమే కలుగబోతుంది అనే ఆత్మవిశ్వాసంతో ఉన్నాడంట రామ్ చరణ్. అందుకే అనుభవశాలి చిరంజీవి చెప్పిన సూచనలను సైతం భేఖాతరు చేశాడని వార్తలు వస్తున్నాయి. కాగా ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్ కార్యక్రమాలను చిత్ర బృందం నిన్న వైజాగ్ లోని సముద్రతీరంలో ఘనంగా నిర్వహించింది. ఈ చిత్రాన్ని ఈ వేసవిలో విడుదలచేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: