మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమా భరత్ అను నేను త్వరలో విడుదల కు సిద్దం కాబోతుంది. అయితే మహేష్ బాబు ఒక వినూత్న కార్య క్రమానికి శ్రీకారం చుట్ట బోతున్నాడు. తన అభిమానులను ఎక్కువ సంఖ్యలో  కలుసుకొనేందుకు ప్లాన్ చేయబోతున్నాడు. అందులో భాగంగా ఈ నెల 18నుంచి నాలుగు రోజుల పాటు అభిమానులను కలిసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రోజుకు 400మందిని కలుస్తున్నారు.

Image result for mahesh babu

సింగిల్ గా లేదూ అంటే ఇద్దరితో, కాదూ అంటే ముగ్గురితో, మాగ్జిమమ్ ఒక గ్రూప్ అంటే నలుగురితో కలిసి మహేష్ ఓపికగా ఫోటొలు దిగుతున్నారు. గంటల కొద్దీ సాగుతోంది ఈ కార్యక్రమం. ఆదివారం, సోమవారం జరిగింది. మంగళ, బుదవారాలు కూడా జరుగుతుంది. అంటే దాదాపు 1600మంది ఫ్యాన్స్ ను వ్యక్తిగతంగా కలుస్తారన్న మాట మహేష్ బాబు. కేవలం కలవడమే కాదు, వచ్చిన వారందరికీ కాఫీలు, టిఫెన్లు కూడా మహేష్ కు చెందిన ఎంబీ కార్పొరేషన్ టీమ్ ఏర్పాటు చేస్తోంది. 
Image result for mahesh babu in bharath anu nenu
ఊళ్లవారీ అభిమానులను రప్పించి కలవడం, అభిమానులతో సమావేశాలు నిర్వహించడం ఇలాంటివి జరుగుతూ వుంటాయి. జనతా గ్యారేజ్ టైమ్లో  పని గట్టుకుని ఎన్టీఆర్ అభిమానులందరినీ కలిసాడు. మెగా హీరోలు కూడా తమ సినిమాల ముందు అభిమానులతో సమావేశం కావడం, వారికి లంచ్ ఏర్పాట్లుచేయడం చేస్తుంటారు. ఈ విధంగా ఈ బడా హీరోస్  సినిమా రిలీజ్ కు ముందు అభిమానులను కలిసే పద్ధతి ఇక అందరు హీరో లు ఫాలో అవుతారని చెప్పవచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: