స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్ మధ్య కాస్త దూరం ఉన్న సంగతి తెలిసిందే. చెప్పను బ్రదర్ తో పవన్ ఫ్యాన్స్ తో కూడా పెట్టేసుకున్న బన్ని డిజే టైంలో మెగా ఫ్యాన్స్ కోపానికి బలయ్యాడు. ఇక ఇప్పుడు మళ్లీ మెగా ఫ్యాన్స్ రుస రుసలాడేలా చేస్తున్నాడని అంటున్నారు. అదెలా అంటే రీసెంట్ గా రంగస్థలం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. 


మెగా పవర్ స్టార్ రాం చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ట్రైలర్ కూడా వదిలారు. ఈ ట్రైలర్ తో రాం చరణ్ నిజంగానే ఆశ్చర్యపరచాడని చెప్పాలి. అయితే ఈ ట్రైలర్ చూసి వరుణ్ తేజ్ రియాక్ట్ అయ్యాడు కాని అల్లు అర్జున్ మాత్రం రెస్పాండ్ అవలేదు.


ఇప్పటికే మెగా ఫ్యాన్స్ కు కాస్త దూరంగా తనకంటూ ఓ సెపరేట్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న బన్ని రంగస్థలం పై స్పందించకుండా ఇంకాస్త దూరం పెంచుకుంటున్నాడని అన్నారు. అయితే నా పేరు సూర్య సినిమా బిజీ వల్లే బన్ని రంగస్థలం ట్రైలర్ గురించి స్పందించలేదని మరో మాట వినిపిస్తుంది.


ఈమధ్యనే మెగా హీరోలంతా కలిసి తమ మీద ఎలాంటి రూమర్స్ రాకుండా.. కథల విషయంలో కూడా ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకునేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే రంగస్థలం ట్రైలర్ విషయంలో బన్ని స్పందించకపోవడంపై మాత్రం మెగా ఫ్యాస్ బన్ని మీద మళ్లీ విమర్శలు చేస్తున్నారు. మరి దీన్ని గుర్తించి బన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే బెటర్.



మరింత సమాచారం తెలుసుకోండి: