ఎలక్షన్స్ టైం దగ్గరపడుతున్న ఈ టైంలో నందమూరి హీరోల ఎం.ఎల్.ఏ టైటిల్ వస్తే ఫ్యాన్స్ లోనే కాదు సిని ప్రేక్షకుల్లో కూడా కాస్త కంగారు ఉంటుంది. అయితే ఇక్కడ మాట్లాడేది పాలిటిక్సే అయినా సినిమా పాలిటిక్స్ అని అర్ధం చేసుకోవాలి. ఇక అసలు విషయం లోకి వెళ్తే కళ్యాణ్ రాం హీరోగా ఉపేంద్ర మాధవ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఎం.ఎల్.ఏ. 


కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 23న రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమా ఆడియో కం ప్రీ రిలీజ్ ఈవెంట్ 21న జరుగనుంది. ఆడియోకి గెస్ట్ గా ముందు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ను పిలుద్దాం అనుకోగా అది కుదరక బాలయ్యను ఈ ఆడియో ఈవెంట్ కు అతిథిగా తీసుకొస్తున్నారట. 


ఎన్.టి.ఆర్ పిలిస్తే వచ్చేవాడే.. అసలు ముందు అనుకుంది అతన్నే కాని త్రివిక్రం సినిమా కోసం వర్కవుట్స్ లో ఉన్న తారక్ అది పూర్తి చేసే పనిలో ఉన్నాడట. అంతేకాదు ప్రస్తుతం తన లుక్ రివీల్ కాకుండా జాగ్రత్త పడుతున్నాడని తెలుస్తుంది. జై లవ కుశ తర్వాత తారక్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.


సో ఎన్.టి.ఆర్ రాడని తెలిసి బాబాయ్ బాలకృష్ణను ఎం.ఎల్.ఏ ఆడియోకి ఇన్వైట్ చేశారట. బాలయ్యతో కళ్యాణ్ రాం కు మంచి సత్సంబంధాలే ఉన్నాయి కాబట్టి తప్పక వస్తాడని అంటున్నారు. లక్కీ హ్యాండ్ అయిన బాలయ్య ఆడియో రిలీజ్ చేస్తే ఆ సినిమా ఫలితం కూడా బాగానే ఉంటుందని టాక్. మరో మూడు రోజుల్లో రిలీజ్ అవనున్న ఈ సినిమా కళ్యాణ్ రాం కు ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: