ఈ నెలాఖరుకు విడుదలకాబోతున్న ‘రంగస్థలం’ మూవీ పై రోజురోజుకు భారీ  అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపధ్యంలో ఈమూవీకి సంబంధించిన ప్రమోషన్ చాలా భారీఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఈమూవీకి సంబంధించిన ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ అమెరికాలోని న్యూజెర్సీ న్యూయార్క్ సిటీలను కలుపుతూ హుడ్సన్ నది పై నిర్మించిన రోడ్ బ్రిడ్జి పై ‘రంగస్థలం’ మూవీని ప్రోమోట్ చేస్తూ ఎర్పాటు చేసిన ‘రంగస్థలం’ హోర్దింగ్ చాలమంది దృష్టిని ఆకర్షిస్తూ ఉంటే మరికొందరు ఈహార్డింగ్ పై సెటైర్లు వేస్తున్నారు. 
RANGASTHALAM MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ప్రస్తుతం ఈహోర్డింగ్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న నేపధ్యంలో ఈఫోటోలు నిజం కావని ఎవరో చరణ్ అభిమానులు ‘రంగస్థలం’ కు అమెరికాలో ఇంత క్రేజ్ ఉంది అని చెప్పుకోవడానికి వీలైన విధంగా ఇలాంటి ఫేక్ ఫోటోలను క్రియేట్ చేసి ఉంటారు అన్న సెటైర్లు వేస్తున్నారు. అయితే ఈమూవీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ మటుకు ఈహోర్డింగ్ కు సంబంధించిన ఫోటోలు ఫేక్ కాదు నిజమైనవే అంటూ వివరణ ఇస్తున్నట్లు తెలుస్తోంది.   
RANGASTHALAM MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈమూవీకి సంబంధించిన ప్రీమియర్ షోలు అమెరికాలో అత్యంత  భారీ స్థాయిలో ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో ఈమూవీ ముగింపుకు సంబంధించి మరొక షాకింగ్ న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ పూర్తి ట్రాజెడీ అని తెలుస్తోంది. 
RANGASTHALAM MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈసినిమాలోని హీరో హీరోయిన్స్ పాత్రలు కూడ చనిపోయారా అని అర్ధం వచ్చేడట్లుగా ఈమూవీని సుకుమార్ ఎండ్ చేసాడు అని టాక్. దీనితో టాప్ హీరోల సినిమాలకు శుభం కార్డు పడకుండా ట్రాజెడీగా ముగిస్తే సామాన్య ప్రేక్షకులు అంగీకరిస్తారా అన్న అనుమానాలు కూడ వ్యక్తం అవుతున్నాయి. సుకుమార్ ప్రయోగాలు ఎవరి ఊహకు అందవు కాబట్టి ‘రంగస్థలం’ లో ఎదోఒక ఊహించని ట్విస్ట్ ఉంది అన్న ప్రచారం ప్రస్తుతం జరుగుతోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: