తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ‘అజ్ఞాతవాసి’ చిత్రం తర్వాత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో తనదైన పాత్ర పోషిస్తున్నాడు పవన్ కళ్యాన్. జనసేన పార్టీ స్థాపించిన నాలుగు సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయిలో పార్టీ వ్యవహారాలు చూసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేసేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి జనసేన పార్టీ పటిష్టత పెంచుకునే పనిలో ఉన్నారు పవన్ కళ్యాన్.
మరోవైపు ఏపికి ప్రత్యేక హోదా కోసం అని పార్టీలను ఏకతాటిపై తీసుకు వచ్చి పోరాటం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక తెలుగు ఇండస్ట్రీలో ‘నచ్చావులే’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అచ్ఛ తెలుగమ్మాయి మాధవీ లత. ‘నచ్చావులే’ చిత్రం తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా పేరు తెచ్చుకోలేక పోయింది.
ఆ మద్య ఓ ఇంటర్వ్యూలో తెలుగు సినీ పరిశ్రమలోని హీరోయిన్లకు ఎదురయ్యే లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా వెల్లడించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. గతంలో పవన్ కళ్యాన్ అంటే తనకేంతో అభిమానం అని చెప్పిన మాధవీ లత ఇప్పుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. పవన్ స్థాపించిన `జనసేన` ద్వారా ప్రజాసేవ చేయాలనుకుంటున్నట్టు మాధవి వెల్లడించింది.
`పవర్స్టార్ పవన్ కల్యాణ్ అంటే నాకెంత ఇష్టమో పదేళ్ల నుంచీ చెబుతూనే ఉన్నా. పవన్ లాగానే నాకూ ప్రజా సేవ అంటే ఎంతో ఇష్టం.`జనసేన` స్థాపించినప్పుడు నేనెందుకు మద్దతివ్వకూడదు. పవన్ కోసం ఏమి చేసేందుకైనా నేను సిద్ధమేన అంటుంది మాధవీ లత.