తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ‘రంగస్థలం’ రచ్చ మొదలైంది.  మొన్న ఫ్రీరిలీజ్ ఫంక్షన్లో ట్రైలర్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఈ సినిమా పై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి.  ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పూర్తి స్థాయిలో గ్రామీణ నేపథ్యంలో లవ్, ఎమోషన్, రాజకీయ కుట్రల నేపథ్యంలో సినిమా తెరకెక్కినట్లు తెలుస్తుంది.  ఈ చిత్రంలో రాంచరణ్ చెవిటివాడి పాత్రలో కనిపిస్తున్నాడు..అతనికి అన్నయ్యగా ఆది నటిస్తున్నారు. 

ఇక అచ్చమైన పల్లెటూరి అమ్మాయిగా..సమంత నటన మరో అద్భుతమని తెలుస్తుంది.  ఒకప్పటి స్టార్ హీరో..ప్రస్తుతం విలన్ గా యూటర్న్ తీసుకున్న జగపతి బాబు ప్రెసిడెంట్ గా బీభత్సమైన విలనీజం చూపించినట్లు కనిపిస్తుంది.

టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా ఉన్న యాంకర్ అనసూయ ‘రంగమ్మత్త’గా కనిపించబోతుంది..దీనికి సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. 

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్..పాటలు మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది.  మార్చి 30న విడుదలవుతోంది. ఈ మూవీకి సంబంధించి ప్రీ-రిలీజ్ ఈవెంట్ వైజాగ్ ఆర్కే బీచ్ లో ఆర్భాటంగా జరిగింది.

సమ్మర్ కి మోస్ట్ ఎవైటెడ్ మూవీగా చెప్పుకుంటున్న ‘రంగస్థలం’లో టైటిల్ సాంగ్ ప్రోమో తాజాగా  రిలీజయియింది. ‘రంగా రంగా రంగస్థలాన..’ అంటూ సాగే చంద్రబోస్ లిరిక్స్ కి, డీఎస్పీ మాసికల్ బీట్స్ కి సింకయ్యేలా స్టెప్స్ చూస్తుంటే..థియేటర్లో ఆడియన్స్ తప్పకుండా సంబరాలు చేసుకుంటారనిపిస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: