నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) జీవిత కథ ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఆ మద్య పలు వివాదాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. యంగ్ ఎన్టీఆర్ గా శర్వానంద్ ని తీసుకున్నారని..బాలకృష్ణకు డైరెక్టర్ తేజకు మద్య వివాదాలు చెలరేగాయని ఇలా ఎన్నో వివాదాలు సోషల్ మీడియాలో సందడి చేశాయి.
అయితే అసెంబ్లీ సమావేశాలకు హాజరైన సమయంలో ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని..వచ్చే సంక్రాంతికి తప్పకుండా రిలీజ్ చేస్తామని చెప్పారు. అయితే తేజకు తనకు మద్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. ఎట్టకేలకు ఎన్టీఆర్ బయోపిక్ సెట్స్పైకి వెళ్తోంది. తేజ డైరెక్షన్లో బాలకృష్ణ నేతృత్వంలో ప్లాన్ చేసిన ‘ఎన్టీఆర్’కి బేస్ రెడీ అయ్యింది.
కథనం, నటీనటుల ఎంపిక దాదాపు పూర్తికావడంతో ఈ ప్రాజెక్ట్ని సెట్స్పైకి తీసుకెళ్లాలని నిర్ణయించాడు బాలయ్య. మార్చి 29న ఈ చిత్రానికి పూజాకార్యక్రమాలు హైదరాబాద్లో నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటన వచ్చేసింది. మరో ప్రత్యేకత ఏంటంటే..ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబులను ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నట్లు సమాచారం.
కేసీఆర్ క్లాప్ కొడతారని, చంద్రబాబు స్విచ్ ఆన్ చేస్తారన్నది ఇన్సైడ్ సమాచారం. పూజా కార్యక్రమాల తర్వాత కొద్దిరోజుల గ్యాప్తో లాంగ్ షెడ్యూల్కి డైరెక్టర్ తేజ ప్లాన్ చేసినట్టు టాక్.