మెగా పవర్ స్టార్ రాం చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా రంగస్థలం. ఈ నెల 30న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ సినిమా అంచనాలను మరింత పెంచేసింది. చిట్టిబాబుగా చరణ్ సరికొత్త లుక్ తో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమా బిజినెస్ అయితే ఓ రేంజ్ లో చేస్తుంది. ఇప్పటికే అన్ని ఏరియాల్లో హంగామా చేస్తున్న రంగస్థలం కర్ణాటకలో రికార్డ్ రేటు పలికిందట.


ఈ సినిమా కర్ణాటకలో 8.1 కోట్ల రూపాయలకు అమ్మేశారని తెలుస్తుంది. రాం చరణ్ స్టామినా కర్ణాటకలో ప్రూవ్ చేసేలా ఈ బిజినెస్ జరిగింది. ఇది ఓ రకంగా రంగస్థలం సినిమాకు ఎంత క్రేజ్ ఉందో తెలియచేస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది.


దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ తో కూడా క్రేజీగా మారింది. పల్లెటూరి కథగా రాబోతున్న రంగస్థలం చరణ్ కెరియర్ లో ఎన్నడూ లేని విధంగా ప్రీ రిలీజ్ బజ్ ఇంకా అంతకంటే భారీ రేంజ్ బిజినెస్ చేస్తుంది. తప్పకుండా ఇది సంచలనాలు సృష్టిస్తుందని ఫిక్స్ అయ్యారు మెగా అభిమానులు.


చిట్టిబాబుగా చరణ్, రామలక్ష్మిగా సమంత ఇద్దరు తమ సహజ నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పూజా హెగ్దె ఐటం స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. యాంకర్ అనసూయ కూడా రంగమ్మత్తగా నటిస్తుంది. మొత్తానికి రంగస్థలం మాస్ అభిమానులు పండుగ చేసుకునే సినిమాగా వస్తుంది. మరి ఆ పండుగ ఎలా ఉండబోతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: