తెలుగులో యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్‌కు కొంత కాలంగా బ్యాడ్ టైమ్ నడుస్తుంది.  ప్రముఖ దర్శకులు టి కృష్ణ తనయుడైన గోపిచంద్ మొదటి సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చినా పెద్దగా హిట్ కాలేదు. దాంతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ పేరు రావాలని మొదట్లో జయం, నిజం, వర్షం లాంటి సినిమాల్లో విలన్ గా నటించాడు.  ఆ తర్వాత మళ్లీ హీరోగా తన ప్రస్థానం మొదలు పెట్టిన గోపిచంద్ వరుస విజయాలతో మంచి ఫామ్ లోకి వెళ్లాడు. 
Image result for gopi chand
కానీ గత నాలుగు సంవత్సరాల నుంచి మాత్రం గోపిచంద్ కి ఏ ఒక్క సినిమా పెద్దగా హిట్ కాలేదు. వరస ఫ్లాపులు రావడంతో ఈసారి హిట్ కొట్టాలని గోపీచంద్ ‘పంతం’ పట్టాడు. గోపీచంద్ హీరోగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న చిత్రం ‘పంతం’. ‘ఫర్ ఎ కాజ్’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమా ద్వారా కె.చక్రవర్తి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
Related image
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఈ రోజు రిలీజ్ చేశారు. రీర్లో 25వ చిత్రం కావడంతో గోపీచంద్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు. వాస్తవానికి స్ట్ లుక్ మార్చి 22న ఉదయం 10 గంటలకు విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే అంతలోనే ఇంటర్నెట్, సోషల్ మీడియాలో పోస్టర్ లీకైంది. గతంలో పవర్, జై లవకుశ చిత్రాలకు రచయితగా పని చేసిన కె చక్రవర్తి ఈ చిత్రం ద్వారా దర్శకుడు పరిచయం అవుతున్నాడు.
Image result for gopi chand
గోపీచంద్ సరసన మెహ్రీన్ హీరయిన్. ఇందులో ఆమె స్కూల్ టీచర్ పాత్రలో కనిపించబోతోంది.ఇంకా పృధ్వి, జయప్రకాష్ రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బేనర్లో కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందించారు. మే 18న సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: