యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ త్రివిక్రం కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనుందని తెలిసిందే. జై లవ కుశ తర్వాత ఎన్.టి.ఆర్, అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రం కలిసి చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఇది. ఈ నెల చివరన మొదలవ్వాల్సిన ఈ సినిమా ఏప్రిల్ 12 నుండి సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమా కథ విషయంలో ఎన్.టి.ఆర్ ఇంకా అసంతృప్తిగానే ఉన్నాడన్నది లేటెస్ట్ టాక్.


అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రం మీద కూడా డౌట్ పడాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే తారక్ త్రివిక్రం ముందు చెప్పిన కథకు కొన్ని మార్పులు సూచించాడట. అయితే మార్పులు చేర్పులన్ని చేశాక కూడా ఇంకా సినిమాపై తారక్ అంత సాటిస్ఫైడ్ గా లేడన్నది టాక్. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఫుల్ పేమెంట్ ఇవ్వడంతో ఎలాగు రాజమౌళి సినిమాకు కాస్త టైం ఉందనే కారణంతోనే త్రివిక్రంతో సినిమా చేస్తున్నాడట ఎన్.టి.ఆర్.  


అజ్ఞాతవాసి ముందు వరకు త్రివిక్రం సినిమా అంటే డెఫినెట్ హిట్ అన్న సంకేతాలుండేవి కాని పవన్ అజ్ఞాతవాసితో మాటల మాంత్రికుడి పెన్ను కూడా పనిచేయడం ఆపేసిందన్న కామెంట్లు వచ్చాయి. దానికి తోడు లార్గో వించ్ సినిమాను యాజిటీజ్ దించేశారని గొడవ చేశారు. ఇలా అన్నిటా త్రివిక్రంకు కాస్త బ్యాడ్ టైమే నడుస్తుంది. 


ఇవన్ని పక్కనపెట్టి ఎప్పటిలానే తన మార్క్ సినిమా అందించే ప్రయత్నంలో ఉన్నాడట త్రివిక్రం. ఏప్రిల్ లో మొదలవనున్న ఈ సినిమా కుదిరితే దసరాకి లేదంటే ఈ ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మరి ఈ సినిమా ఎన్.టి.ఆర్ పెట్టుకున్న నమ్మకం నిలబెడుతుందో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: