వచ్చే వారం విడుదల కాబోతున్న ‘రంగస్థలం’ మ్యానియా ప్రస్తుతం టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. ఈమూవీ ఖచ్చితమైన బ్లాక్ బస్టర్ హిట్ అన్న ప్రచారం చాలా వ్యూహాత్మకంగా జరుగుతోంది. దీనికితోడు ఈమూవీకి అత్యంత భారీ బిజినెస్ అయిన నేపధ్యంలో ఈమూవీ కలక్షన్స్ ఏరేంజ్ లో ఉండబోతున్నాయి అన్న అంచనాలతో టాలీవుడ్ విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా దర్శకుడు సుకుమార్ ఎంతో కష్టపడి తీసిన ‘రంగస్థలం’ మూవీ కథ మొదట్లో జూనియర్ ఎన్టీఆర్ ను దృష్టిలో పెట్టుకుని వ్రాసాడు అని తెలుస్తోంది. జూనియర్ తో ‘నాన్నకు ప్రేమతో’ సినిమాను సుకుమార్ తీస్తున్న సమయంలో ఈకథ గురించి సుకుమార్ జూనియర్ వద్ద ప్రస్తావించినా జూనియర్ అంతగా ఆసక్తి కనపరచలేదని టాక్.
దీనితో ఆతరువాత ఈకథకు అనేక మార్పులు చేసి రామ్ చరణ్ ను ఈకథకు సంబంధించి చిట్టిబాబుగా మార్చాడు సుకుమార్. ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అవుతున్న ఈమూవీకి ఏర్పడ్డ క్రేజ్ జూనియర్ దృష్టి వరకు వెళ్ళడంతో సుకుమార్ తనకు చెప్పిన కథలో ఇంత పట్టు ఉందా అని ఆశ్చర్యపడటమే కాకుండా ‘రంగస్థలం’ కథను వదులుకుని తాను తప్పు చేసానా అని తన సన్నిహితులవద్ద ఫీలవుతున్నట్లు గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి.
రంగస్థలం’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చిరంజీవి చెప్పినట్లుగా ఈమూవీ ద్వారా చరణ్ కు అవార్డులు భారీ రికార్డులు వస్తే నిజంగానే జూనియర్ సుకుమార్ చెప్పిన ఈకథకు స్పందించకపోవడం ఒక పొరపాటు అని అనుకునే అవకాసం ఉంది. చాలామంది టాప్ హీరోలు కూడ ‘రంగస్థలం’ మూవీకి వచ్చిన క్రేజ్ ను చూసి ఆశ్చర్యపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈమూవీకి ఏవరేజ్ టాక్ వచ్చినా సమ్మర్ రేస్ ను ప్రారంభిస్తున్న ఈమూవీకి భారీ కలక్షన్స్ రావడం ఖాయం అని అంటున్నారు టాలీవుడ్ విశ్లేషకులు..