పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరమై ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాలలో కొనసాగుతున్న నేపధ్యంలో అనుకోకుండా పవన్ మహేష్ ‘భరత్ అనే నేను’ కు సమస్యగా మారాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆశ్చర్యకరమైన ఇలాంటి కామెంట్ రావడం వెనుక ఒక ఆసక్తికర విషయం ఉంది. ఈమధ్య కాలంలో టాప్ హీరోల సినిమా ఫంక్షన్స్ అన్నీ విశాఖపట్నంలో జరుగుతున్నాయి.
BHARATH ANE NENU MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మహేష్ టీమ్ కూడ వచ్చేనెల విడుదల కాబోతున్న ‘భరత్ అనే నేను’ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ను విశాఖపట్టణంలో ఏర్పాటు చేయాలని భావించారు. అయితే ఇప్పుడు ఈ ఫంక్షన్ కు పవన్ సమస్యగా మారాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. పవన్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ హోదా విషయమై వ్యాఖ్యలు చేస్తూ జనం మధ్యకు వచ్చిన నేపధ్యంలో టాప్ హీరోలు ఈసమస్య పై ఎందుకు మాట్లాడటం లేదు అన్న కామెంట్స్ వస్తున్నాయి.
BHARATH ANE NENU MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
మహేష్ నటిస్తున్న ‘భరత్ అనే నేను’ రాజకీయ నేపధ్యం ఉన్న కథ కావడంతో ఈమూవీ ఫంక్షన్ వైజాగ్ లో నిర్వహిస్తే ఇప్పటికే ప్రత్యేక హోదా ఉద్యమంతో రగిలిపోతున్న ఆంధ్రప్రదేశ్ లోని యువత ఈ ఉద్యమానికి బాసటగా నిలవమని మహేష్ అడిగే ఆస్కారం ఉంది. ఈమధ్య వైజాగ్ లో జరిగిన ‘రంగస్థలం’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడ చిరంజీవికి కూడ ఇటువంటి సమస్య ఎదురైనా విషయం తెలిసిందే.
BHARATH ANE NENU MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈ నేపధ్యంలో ‘భరత్ అనే నేను’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను వైజాగ్ లో నిర్వహించడం కంటే హైదరాబాద్ లోనే నిర్వహించడం మంచిది అన్న అభిప్రాయానికి మహేష్ టీమ్ వచ్చినట్లు టాక్. ఈమూవీలో మహేష్ ముఖ్యమంత్రి పాత్రను పోషిస్తున్న నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ను కుదిపేస్తున్న సున్నిత సమస్య పై స్పందించకుండా వెండితెర పై మాత్రం ముఖ్యమంత్రి పాత్రను పోషిస్తూ పవర్ ఫుల్ డైలాగులు చెపితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంగీకరించరు అన్న భయంతోనే ఈమూవీ ఫంక్షన్ జరిగే ప్రదేశాన్ని విశాఖపట్నం బదులుగా హైదరాబాద్ కు మార్చారని అంటున్నారు. పవన్ ఇలా అంతర్లీనంగా ‘భరత్ అనే నేను’ కు సమస్యగా మారాడు అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: