మహానటి..అందాల తార సావిత్రి జీవిత నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం మహానటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ బుధవారంతో పూర్తైంది. ర్తి సురేశ్ ప్రధానమైన పాత్రలో 'మహానటి' సినిమా రూపొందింది. నిన్నటితో షూటింగు పార్టును పూర్తి చేసుకుంది. దాంతో ఈ సినిమా టీమ్ షూటింగుకి గుమ్మడికాయ కొట్టేశారు. యూనిట్ సభ్యులంతా కలిసి .. సావిత్రి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
మే 9న తెలుగు, తమిళ భాషలలో మహానటి చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సి. అశ్వినీదత్ సమర్పణలో వైజయంతి సినిమా పతాకంపై స్వప్నా దత్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతుంది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించగా, జర్నలిస్ట్ మధురవాణిగా సమంత, జెమినీ గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ కనిపించనున్నారు. షాలిని పాండే, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
యూనిట్ సభ్యులంతా చాలా రోజులుగా ఈ సినిమా చేస్తూ వచ్చారు. అందువలన సావిత్రి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి తెలుసుకుని వాళ్లు కదిలిపోయారు. అందువలన ఆ సంఘటనలను గుర్తుచేసుకుని .. షూటింగు ముగింపు రోజున అంతా కన్నీళ్లు పెట్టుకున్నారట.
అయితే సావిత్రి చివరి రోజులలో అనుభవించిన దుర్భర జీవితాన్ని సినిమాలో చూపించరని తెలుస్తుంది. మిక్కీ జేయర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తమిళంలో ‘నడిగర్ తిలగమ్’ అనే టైటిల్ తో ఈ మూవీ విడుదల కానుంది.