తెలుగు ఇండస్ట్రీలో వరుసగా చాన్స్ లో దక్కించుకొని మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్ రాశీఖన్నా. ‘ఊహలు గుస గుసలాడే’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తర్వాత సాయిధరమ్ తేజ్ తో నటించిన ‘సుప్రీమ్’ తో మంచి విజయం సాధించింది. ఎన్టీఆర్ సరసన ‘జై లవకుశ’ చిత్రంలో నటించిన రాశీఖన్నా తమిళ ఇండస్ట్రీలో కూడా ఎంట్రీ ఇచ్చింది.
ఇటీవల తొలి ప్రేమ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన విషయం తెలిసిందే. తాజాగా టీమిండియా క్రికెటర్ బుమ్రాను రాశి పెళ్లి చేసుకోనుందనే వార్తలు వచ్చాయి. గతంలో తొలిప్రేమ సినిమా ప్రమోషన్ సందర్భంగా రాశీ మీడియాతో మాట్లాడుతూ క్రికెటర్ బూమ్రా అంటే తనకు ఇష్టమని చెప్పిందనే వార్తలు వచ్చాయి. ఓ షోలో ఈ వార్తలపై రాశి ఖండించింది.
బుమ్రా ఒక క్రికెటర్ అని మాత్రమే తనకు తెలుసని... అంతకు మించి అతని గురించి తనకు ఏమీ తెలియదని చెప్పింది. క్రికెటర్లు, ఫిలిం స్టార్స్ మధ్య ప్రేమాయణాలు మనకు చాలా కామన్. అయితే ప్రస్తుతం క్రికెటర్ బుమ్రా, సినీ నటి రాశీఖన్నా పెళ్లి చేసుకుంటారన్న పుకార్లు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి.
ఓ టీవీ కార్యక్రమంలో రాశీఖన్నా మాట్లాడుతూ.. అతని మ్యాచ్ లు కూడా తాను చూడలేదని తెలిపింది. ఒక వ్యక్తిగా ఆయన ఎవరో కూడా తనకు తెలియదని చెప్పింది. ఈ రూమర్ ఎలా వచ్చిందో అర్థం కావడం లేదని తెలిపింది. కొన్ని హిందీ వెబ్ సైట్లు ఈ ప్రచారం చేశాయని చెప్పింది. ఇలాంటి రూమర్లు ఎలా పుట్టుకొస్తాయోనని అసహనం వ్యక్తం చేసింది.