ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో బయోపిక్ చిత్రాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు.  ఈ నేపథ్యంలో అలనాటి అందాల తార..తన హావభావాలతోనే సీన్ రక్తికట్టించగల మహానటి సావిత్రి జీవిత కథ ఆదారంగా ‘మహానటి’ బయోపిక్ చిత్రాన్ని ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. ఇక సావిత్రి పాత్రలో మళియాళ బ్యూటీ కీర్తి సురేష్ నటిస్తుంది. జెమినిగణేషన్ పాత్రలో మమ్ముట్టి తనయుడు దుల్కన్ సల్మాన్ నటిస్తున్నాడు.  ఇతర ముఖ్య పాత్రలో సమంత, షాలినిపాండే, మోహన్ బాబు, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్ లు నటిస్తున్నారు. 
Image result for ys rajasekhar
ఇదిలా ఉంటే...తెలుగు జాతి గర్వపడేలా తన నటనా, రాజకీయాలతో కోట్ల మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటులు ఎన్టీఆర్ జీవిత కథ ఆదారంగా ‘ఎన్టీఆర్’ బయోపిక్ ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ తెరకెక్కిస్తున్నారు.  ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నారు.  ఎన్టీఆర్ పాత్రలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్నారు. తాజాగా తెరపైకి ఇప్పుడు బయోపిక్ చిత్రం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో మహానేతగా పేరు తెచ్చుకున్న స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆదారంగా ఓ చిత్రాన్ని తీయబోతున్నారు. 
Image result for mammootty
వై.ఎస్.ఆర్. బయోపిక్ కి సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. 'ఆనందో బ్రహ్మ' సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్న మహి వి. రాఘవ్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో వైఎస్ఆర్ గా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించనున్నట్టు తెలుస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు ప్రస్తున్న వైసీపీ అధినేత జగన్ పాత్రలో తమిళ స్టార్ హీరో సూర్య చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది. జగన్ భార్య భారతి పాత్రలో కీర్తి సురేశ్ నటించే అవకాశం వున్నట్టుగా చెబుతున్నారు. 
Image result for surya
ఇప్పటికే మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో నటిస్తున్న కీర్తి సురేష్ అయితే ఆ పాత్రకు న్యాయం చేయగలదని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. 30 కోట్ల బడ్జెట్ తో విజయ్ చిల్లా .. దేవిరెడ్డి శశి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి 'యాత్ర' అనే టైటిల్ ను ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర .. ఆయన ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం వరకూ ఈ కథ కొనసాగుతుందని అంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: