ఈ మద్య స్టార్ హీరోల సినిమాలు ముహూర్తం షాట్ నుంచి కలెక్షన్ల ఎండ్ వరకు సోషల్ మీడియాలో ప్రతి విషయాన్ని వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా పెద్ద బ్యానర్ లో వచ్చే సినిమాలు కమర్షియల్ గా హిట్ కొట్టాలంటే.మొదటి నుంచి ప్రచారం మీదే ఆదారపడుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్ నటించిన ‘రంగస్థలం’ రచ్చ చేస్తుంది.
ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే అంచనాలు విపరీతంగా పెంచుతున్నాయి. ఫస్ట్ లుక్, సాంగ్స్, ట్రైలర్ కి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ వచ్చింది. అంతే కాదు రంగస్థలం సినిమా పాటలకు సంబంధించి ఒక్కో ప్రోమో రిలీజ్ చేస్తూ మరింత ఆసక్తి రేపుతున్నారు. తాజాగా సినిమా మేకర్లకు కొత్తగా వచ్చిన ఆదాయ వనరు డిజిటల్ రైట్స్. ఇంటర్నెట్ విస్తృత స్థాయిలో అందుబాటులోకి వచ్చాకా.. సినిమాలకు డిజిటల్ రైట్స్ ద్వారా మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ఎంతలా అంటే.. శాటిలైట్ రైట్స్ కు తీసిపోని రీతిలో.. సినిమాకు డిజిటల్ రైట్స్ ద్వారా డబ్బులు వస్తున్నాయి.
అది కూడా కోట్ల రూపాయల్లో సంపాదన వస్తుంది. ఈ పరంపరలో రామ్ చరణ్ తేజ తాజా సినిమా ‘రంగస్థలం 1985’ డిజిటల్ రైట్స్ కూడా భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని సమాచారం.
ఏకంగా పది కోట్ల రూపాయల మొత్తాన్ని వెచ్చించి అమెజాన్ సంస్థ రామ్ చరణ్ సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ లో రంగస్థలం భారీ వ్యాపారాన్నే చేసింది. మార్చి 30 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.