అనుష్క... టాలీవుడ్ లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న బ్యూటీ. మొన్న బాహుబలితో సందడి చేసిన స్వీటీ.. రీసెంట్ గా భాగమతిగా కనిపించి హర్రర్ రూట్ లో ట్రెరర్ క్రియేట్ చేసింది. ఇంత వరకూ ఓకే.. కానీ తరువాతే సీన్ సితారైంది. ఇప్పటి వరకూ ఏ ప్రాజెక్ట్ పట్టాలెక్కని పరిస్థితి కనిపిస్తుంది. ఇంతకీ అనుష్క ఇలాంటి డైలామాలో పడిపోవడానికి రీజన్ ఏంటి?

Image result for anushka shetty

టాలీవుడ్ లో ఒకవైపు కలరింగ్ తో కవ్వించి... మరోవైపు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో ట్రెండ్ సెట్ చేసిన బ్యూటీ అనుష్క. బాహుబలి-2 తర్వాత ఇప్పటివరకు మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. రీసెంట్ గా వచ్చిన భాగమతి కూడా బాహుబలి-2 కంటే ముందే ఓకే చేసిన సినిమానే తప్ప కొత్త ప్రాజెక్టు కాదు. దీనికి తోడు ప్రజెంట్ ఈ బ్యూటీ పెళ్లిపై ఫోకస్ పెంచింది కాబట్టి కొత్త సినిమాలకు కమిట్ అవ్వదని పుకార్లు షికారు చేస్తున్నాయ్. అయితే లేటేస్ట్ గా అందిన సమాచారం ప్రకారం తన వద్దకొచ్చిన కథల్లో ఓ కథను ఫైనలైజ్ చేసే పనిలో బిజీ అయిందట ఈ బొమ్మాళి. త్వరలో ఈ ప్రాజెక్ట్ పై ఎనౌన్స్ మెంట్ కూడా ఇవ్వబోతుందట.

Image result for anushka shetty

నిజానికి గత కొంతకాలంగా ఈ బ్యూటికి కథలు చెప్పే డైరెక్టర్స్ తగ్గిపోయారంటూ ఆమధ్య సంచలన ప్రకటన చేసింది అనుష్క. అందుకే తన వద్దకొచ్చిన 2-3 కథల్లో మంచి స్టోరీని ఎంచుకునే పనిలో పడింది. వీటిలో దర్శకుడు గౌతమ్ మీనన్ చెప్పిన స్టోరీ కూడా ఉంది. ఆ స్టోరీలైన్ కే అనుష్క ఇప్పుడు ఓటేసినట్టు సమాచారం. ప్రజంట్ విక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నాడు గౌతమ్ మీనన్. అటు అనుష్క కూడా బరువు తగ్గే పనిలో బిజీగా ఉంది. విక్రమ్ తో చేస్తున్న ధృవనక్షత్రం రిలీజ్ అయిన వెంటనే అనుష్కతో చేయబోయే సినిమాపై అఫిషియల్ అనౌన్స్ మెంట్  వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.

Image result for anushka shetty

మొత్తానికి రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ కు అనుష్క దూరమనే విషయం తెలిసిందే. సినిమాల్లో ఇలా వచ్చి నాలుగు స్టెప్పులేసి అలా వెళ్లిపోయే పాత్రల్ని ఆమె అంగీకరించదు. కథ మొత్తం ఆమె చుట్టూనే తిరగాలి. అలాంటి స్టోరీనే సిద్ధం చేశాడట గౌతమ్ మీనన్. ఎప్పట్లానే ఈ సినిమాలో కూడా సరికొత్త మేకోవర్ లో ఆమె కనిపిస్తుందట. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో.. ఇందులో ఎంతవరకూ నిజముందో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: