రాం చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో మొదటిసారిగా వస్తున్న క్రేజీ మూవీ రంగస్థలం. మరో నాలుగు రోజుల్లో రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ఈరోజు సెన్సార్ స్కూట్నీకి వెళ్లింది. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా యు/ఏ సర్టిఫికెట్ సంపాదించుకుంది. 1985 కాలం నాటి కథతో వస్తున్న ఈ రంగస్థలం సినిమాలో రాం చరణ్ చిట్టిబాబు చెవిటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు.


మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో సమంత రామలక్ష్మిగా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఇప్పటికే సూపర్ హిట్ అయ్యింది. ఇక సెన్సార్ రివ్యూ మాత్రం సినిమా పక్కా హిట్ బొమ్మ అన్నట్టు టాక్ వచ్చింది. సినిమాలో రాం చరణ్ నటన అద్భుతంగా ఉందట.


చిట్టిబాబుగా చరణ్ పూర్తి మేకోవర్ మాత్రమే కాదు నటనతో కూడా ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేస్తాడని టాక్ వచ్చింది. సెన్సార్ వాళ్లు ఈ సినిమా చూసి పూర్తి సాటిస్ఫై అయ్యారట. చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమా చూశామన్న ప్రశంసలు కూడా మైత్రి మూవీ మేకర్స్ కు అందించారట.


మొత్తానికి సెన్సార్ నుండి రంగస్థలం కు హిట్ టాక్ వచ్చింది. ట్రైలర్ తో సినిమా కథ చూచాయగా చెప్పినా చరణ్ నటన హైలెట్ గా నిలవనున్న ఈ రంగస్థలం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. పూజా హెగ్దె ఐటెం సాంగ్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. మరి అనుకున్న అంచనాలను రంగస్థలం రీచ్ అయ్యిందో లేదో చూడాలంటే మరో నాలుగు రోజులు వెయిట్ చేయాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: