శ్రీ విష్ణు హీరోగా వేణు ఊడుగుల డైరక్షన్ లో వచ్చిన సినిమా నీదీ నాదీ ఒకే కథ. అప్పట్లో ఒకడుండేవాడు సినిమా మేకర్స్ నుండి వచ్చిన ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా సూపర్ సక్సెస్ అయ్యింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎడ్యుకేషన్ సిస్టెం ఎలా ఉంది అని చాటిచెబుతూ వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.


ఇక సినిమాకు పెట్టిన బడ్జెట్ ఇప్పటికే రికవర్ అవగా ఇప్పుడు సినిమా టాక్ బాగా ఉండటంతో తెలుగు రెండు రాష్ట్రాల్లో మరో 70 థియేటర్స్ కు ఈ సినిమా పెంచుతున్నారట. శ్రీవిష్ణు రేంజ్ సినిమాకు ఈ ఆక్యుపెన్సీ చాలా గొప్ప విషయమనిన్ చెప్పాలి. ఈమధ్య స్టార్ హీరో సినిమాలు హిట్ అయితే ఓకే కాని ఫ్లాప్ అయితేనే పరిస్థితి వేరేలా ఉంటుంది.


ఈ క్రమంలో ఇలాంటి చిన్న సినిమాలు ఇండస్ట్రీకి చాలా అవసరమని అంటున్నారు విశ్లేషకులు. అనవసరపు కమర్షియల్ హంగులకు పోకుండా సినిమా కంటెంట్ అందరికి ఎక్కేలా చేశారు.  అందుకే సినిమా టాక్ ను బట్టి ఎక్స్ ట్రా థియేటర్స్ కూడా ఇస్తున్నారు. ఇక మరోపక్క కళ్యాణ్ రాం ఎమ్మెల్యే సినిమా కూడా పర్వాలేదు అన్న టాక్ వచ్చింది.


అయితే రెండిటిలో మాత్రం నీదీ నాదీ ఒకే కథ హిట్ అన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే పబ్లిసిటీతో కలిపి పెట్టిన రెండున్నర కోట్లు వచ్చేశాయి. ఇక ఇప్పుడు వచ్చేదంతా లాభమే అని తెలుస్తుంది. మరి ఈ ఇయర్ అసలు సిసలు సూపర్ హిట్ సినిమా అంటే శ్రీవిష్ణు నీదీ నాదీ ఒకే కథ అని చెప్పొచ్చేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: