హీరోగా వరుస సక్సెస్లతో స్టార్ రేంజ్ కు తగినట్టుగా బాక్సాఫీస్ సునామి సృష్టిస్తూ వెళ్తున్న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. స్టార్ మా బిగ్ బాస్ తొలి సీజన్ లో తారక్ హోస్టింగ్ కు అందరు ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు వాణిజ్య ప్రకటనలకు తారక్ బెస్ట్ అనిపించుకుంటున్నాడు.


ప్రస్తుతం త్రివిక్రం తో సినిమాకు సిద్ధమవుతున్న ఎన్.టి.ఆర్ దానికంటే ముందు ఐపిఎల్ యాడ్ లో కనిపిస్తున్నాడు. స్టార్ గ్రూప్ ఈ ఐపిఎల్ సీజన్ ను తెలుగులో కూడా కామెంటరీ ఇస్తుంది. దానికి ప్రోమో యాడ్ కొద్ది నిమిషాల క్రితం వదిలారు. వివో ఐపిఎల్ తెలుగులో వచ్చేస్తుంది అనే కాన్సెప్ట్ తో కూడిన యాడ్ ఇది.


ఇక వివో ఐపిఎల్ తెలుగులో వస్తుంది అని హేమంత్ అనగా టివిలో వస్తే చాలు తెలుగులో ఎందుకు అంటాడు మరో స్నేహితుడు. ఇక అప్పుడు ఎన్.టి.ఆర్ కారం లేని కోడి, ఉల్లిపాయ లేని పకోడి, పెట్రోల్‌ లేని గాడి, మీసాల్లేని రౌడీ, పరిగెత్తడం రాని కోడీ, ఆవకాయ్‌ లేని జాడీ, ఆటల్లేని బడి, అమ్మప్రేమ లేని ఒడి అసలు మజా తెలుగురా.. అంటూ ఎన్.టి.ఆర్ తన మార్క్ డైలాగ్ తో దుమ్ముదులిపేశాడు.


ఆ యాడ్ అలా వచ్చిందో లేదో ఇలా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. స్టార్ గ్రూప్ తో ఉన్న అనుబంధంతో ఈ ప్రోమో యాడ్ చేశాడు. త్రివిక్రం డైరెక్ట్ చేసిన ఈ యాడ్ ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. ఇక ప్రోమో మాత్రమే కాదు ఇలాంటి యాడ్స్ ఇంకా చాలా చేసినట్టు తెలుస్తుంది.


ఏప్రిల్ 12 నుండి రెగ్యులర్ షూట్ కు వెళ్తున్న త్రివిక్రం సినిమా దసరా కల్లా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. ఈ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ రాజమౌళి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. అందులో రాం చరణ్ కూడా నటిస్తున్నాడని తెలిసిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: