నితిన్ హీరోగా కృష్ణ చైతన్య డైరక్షన్ లో వచ్చిన సినిమా ఛల్ మోహన్ రంగ. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్లో సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ సమర్పకుడిగా ఉన్నాడు. సినిమాలో హీరోయిన్ గా లై భామ మేఘా ఆకాష్ నటించింది. తమన్ మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్ గా సినిమా వచ్చింది.


అఆ హిట్ అవడమే కాదు నితిన్ కెరియర్ లో 50 కోట్ల సినిమా అయ్యింది. ఇక ఆ తర్వాత వచ్చిన లై నిరాశ పరచినా సరే ఆ క్రేజీ జోడీతోనే వచ్చిన ఈ ఛల్ మోహన్ రంగ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. టీజర్, ట్రైలర్ చూస్తే సినిమా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అనిపిస్తుంది. 


అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఫ్యాన్సీ ప్రైజ్ అందుకుందట. వరల్డ్ వైడ్ గా నితిన్ సినిమా 20 కోట్ల దాకా పలికిందని తెలుస్తుంది. అయితే సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే 20 కోట్లు పెద్ద లెక్క కాదని అంటున్నారు. నైజాం లో 6 కోట్ల దాకా పలికిన ఛల్ మోహన్ రంగ సినిమా టాక్ బాగుంటే అన్ని చోట్ల సేఫ్ అన్నట్టే.


రిలీజ్ బజ్ చూస్తుంటే ఈ సినిమా మళ్లీ నితిన్ కు హిట్ ఇస్తుందనే అనిపిస్తుంది. త్రివిక్రం రచనా సహకారం కాబట్టి సినిమా కొంతమేర ప్రభావం చూపుతుందని చెప్పొచ్చు. మరి సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి. అంచనాలను రీచ్ అయితే 20 కోట్లు పెద్ద కష్టం ఏమి కాదని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: