టాలీవుడ్ లో రంగస్థలం ఇచ్చిన బూస్ట్ తో ఇప్పుడు అందరి చూపు మహేష్ భరత్ అను నేనుపై పడింది. వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న మహేష్ ఈ సినిమాతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడోనని అందరూ వెయిట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టే టీజర్ నుంచి ప్రీరిలీజ్ వరకూ ప్రతిదీ పక్కాగా ప్లాన్ చేసాడు డైరెక్టర్.


టాలీవుడ్ లో హీరోల మధ్య పోటీ పోటెత్తింది. ఇప్పటికే రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ అవగా.. అదే రేంజ్ లో రీసౌండ్ చేయడానికి కి రెడీ అవుతోంది భరత్ అనే నేను. ప్రజెంట్ ఈ సినిమా పనులు చకచకా పూర్తైపోతున్నాయ్. ఏప్రిల్ 20న రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ ఇప్పటికే ఫిక్స్ అయింది. దీంతో షూటింగ్ ఫైనల్ టచెస్ తో పాటు.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా స్పీడందుకున్నాయ్.

Image result for bharat anu nenu

పొలిటికల్ బేస్డ్ కమర్షియల్ మూవీగా వస్తున్న ఈ సినిమాని కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో యాక్షన్ పార్ట్ కూడా ఓ రేంజ్ లో ఉంటుందని టీజర్ లో చూపించారు. ఇంటర్వెల్ బ్యాంగ్.. క్లైమాక్స్ లో వచ్చే ఫైటింగ్ సన్నివేశాలు.. మాస్ ఆడియన్స్ ను విపరీతంగా అలరిస్తాయనే టాక్ ఊపందుకుంది. వీటికి గ్రాండ్ లుక్ ఇవ్వడం కోసం కంప్యూటర్ గ్రాఫిక్స్ ను కూడా జోడిస్తున్నడట కొరటాల. ఇప్పటికే సీజీ వర్క్ ఫుల్ స్వింగ్ లో ఉందని తెలుస్తోంది.

Image result for bharat anu nenu

ఇలా ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తూనే మరోవైపు ఫ్రిరీలీజ్ బిజినెస్ తో అంచనాలను ఎవరెస్ట్ ఎక్కేలా ప్లాన్ చేసాడు కొరటాల. ఈ ఈవెంట్ ని ఎల్.బి.స్టేడియంలో ప్లాన్ చేసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నారు. ఈ ఫంక్షన్ కి యంగ్ టైగర్ అటెండ్ అవుతుండటంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ పుల్ ఖుషీ అవుతున్నారు. ఇంతవరకు ఓకే... కానీ ఈ సినిమా రిజల్ట్ పైనే మహి ఫ్యూచర్ అధారపడి ఉంది. అందుకే దొరికిన ప్రతి ఛాన్స్ ని ప్లస్ గా మార్చుకునే పనిలో బిజీ అయ్యాడు కొరటాల. మరి ఏప్రిల్ 20న వస్తున్న ఈ సినిమా మహి కెరీర్ కి ఎలాంటి బూస్ట్ ఇస్తుందో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: