తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అక్కినేని నాగ చైతన్య. తొలి చిత్రం ‘జోష్’ పెద్దగా సక్సెస్ కాలేదు..ఆ తర్వాత వచ్చిన ‘ఏం మాయ చేసావే’ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రంతో తెలుగు లో మళియాళ భామ సమంత హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అయితే రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా వీరిద్దరు ప్రేమలో పడ్డారు.
ఇటీవల గోవాలో రెండు సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. నాగచైతన్యను వివాహం చేసుకుని, అక్కినేని వారింటి కోడలైనా సమంత జోరు ఏమాత్రం తగ్గడం లేదు. సాధరణంగా పెళ్లైన వారిని కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్లుగా తీసుకోవడానికి భయపడతారు. కానీ, సమంత విషయంలో మాత్రం అలా జరగడం లేదు. ఇటీవల సమంత హీరోయిన్గా నటించిన రంగస్థలం తెలుగులో అతి పెద్ద విజయం సాధించింది.
అంతే కాదు సమంత నటనకు టాలీవుడ్, కోలీవుడ్ సైతం ఫిదా అయ్యారు. ఈ మూవీలో సమంత పోషించిన ‘రామలక్ష్మి’ పాత్రకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లో పాల్గొన్న సమంత ఈ మూవీ విశేషాలతో పాటు నాగ చైతన్యకు శ్రీమతిగా మారిన తరువాత లైఫ్ ఎలా ఉందన్నదానిపై పర్సనల్ విషయాలను షేర్ చేసుకున్నారు.
మాతృత్వం ఆడ జన్మకు ఓ వరం. ప్రసవం పునర్జన్మతో సమానం. పెళ్లయిన మహిళలు తల్లి కావాలని కలలు కంటారు. ఆ భాగ్యాన్నిదక్కించు కోవడం కోసం తాపత్రయ పడుతుంటారు. శిశువు కడుపులో పడగానే వారికి కలిగే ఆనందం అంతా ఇంతా కాదు అయితే ఆ మధురానుభూతి పొందుతానంటుంది సమంత. తల్లినైన తర్వాత నా బేబీయే నాకు ప్రపంచమవుతుంది. ఉద్యోగాలు చేసే తల్లులంటే నాకు చాలా గౌరవం. పిల్లల కోసం వాళ్లు ఎన్నో త్యాగాలు చేస్తారు. అందరిలాగానే నేనూ తల్లినైన తర్వాత కొన్ని సంవత్సరాలు ఆ బిడ్డే లోకంగా బతుకుతానని సమంత చెప్పింది.