తెలుగు ఇండస్ట్రీలో హ్యాపీడేస్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తమన్నా ఆ తర్వాత తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో నటించింది. కానీ పెద్దగా పేరు తెచ్చుకోలేక పోయింది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో ఐటమ్ సాంగ్ లో కూడా నటించింది తమన్నా. ఇక రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రంలో అవంతిక పాత్రలో నటించిన తమన్నా అప్సరసలా కనిపించింది.
ఈ చిత్రంలో తమన్నా కాస్ట్యూమ్స్, నటన అద్భుతంగా ఆకర్షించాయి. బాహుబలి చిత్రంలో మొదట దేవకన్యలా కనిపించిన తమన్నా తర్వాత పోరాట యోధురాలిగా కనిపించింది. తాజాగా తమన్నాకు అరుదైన పురస్కారం లభించింది. దాదా సాహెబ్ ఫాల్కే ఫౌండేషన్ సినీ పరిశ్రమకు చెందిన దర్శకులు,నటులు, నిర్మాతల ప్రతిభ ఆధారంగా ప్రతి ఏడాది ‘దాదా సాహెబ్ ఫాల్కే ఎక్స్లెన్స్ అవార్డు’తో సత్కరిస్తున్నది.
ఇప్పటికే పద్మావత్ చిత్రంలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రలో విలక్షణ నటనతో ఆడియెన్స్ ను కట్టిపడేసిన రణ్వీర్ కు, దీపికా పడుకోణే లకు ‘దాదా సాహెబ్ ఫాల్కే ఎక్స్లెన్స్ అవార్డు’కి ఎంపిక చేసినట్లు అవార్డు కమిటీ సభ్యులు ప్రకటించారు.
తాజాగా బాహుబలి చిత్రంలో అవంతిక పాత్రలో అద్బుతంగా నటించిన తమన్నా ‘దాదా సాహెబ్ ఫాల్కే ఎక్స్లెన్స్ అవార్డు’కి ఎంపిక చేసినట్లు తెలిపింది. ఏప్రిల్ 21న ముంబైలో జరుగనున్న కార్యక్రమంలో రణ్ వీర్, దీపికా, తమన్నా ఈ అవార్డులను అందుకోనున్నారు.