గత రెండు సంవత్సరాలుగా అపజయం అన్న పదం ఎరుగకుండా వరస విజయాలతో దూసుకుపోతున్న నాని సినిమాల సక్సస్ కు సంబంధించి బ్రేక్ పడింది. నిన్న విడుదలైన ‘కృష్ణార్జున యుద్ధం’ ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకోవడంతో నేచురల్ స్టార్ నానీ షాక్ అయినట్లుగా తెలుస్తోంది.
పరస విజయాలతో దూసుకుపోతున్న నాని క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని మన ఇరు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడ అత్యధిక ధియేటర్లలో ‘కృష్ణార్జున యుద్ధం’ రిలీజ్ చేసారు. అయితే ఆశ్చర్యకరంగా నిన్న విడుదలైన చాల ధియేటర్లలో ఫస్ట్ షోకు కేవలం 60 శాతం మంది ప్రేక్షకులు కనిపించారు అంటే ఈసినిమా పై నెగిటివ్ టాక్ ఏవిధంగా స్ప్రెడ్ అయిందో అర్ధం అవుతుంది.
దీనికితోడు నాని సినిమాల పట్ల విపరీతమైన క్రేజ్ ను ప్రదర్శించే ఓవర్సీస్ ప్రేక్షకులు కూడ ఈసినిమా పట్ల ఏమాత్రం ఆసక్తిని కనపరచక పోవడంతో ఓవర్సీస్ లో కూడ ఈమూవీకి ఎదురుగాలి వీస్తోంది. ఈమూవీలో నాని అర్జున్ పాత్రలో రాక్ స్టార్ గా కనిపించడంతో పక్కింటి అబ్బాయిలా కనిపించే నాని రాక్ స్టార్ ఏమిటి అంటూ చాలామంది ఓపెన్ గా కామెంట్ చేస్తున్నారు.
ఈ పరిస్థితులలో వైరల్ గా స్ప్రెడ్ అవుతున్న ఈమూవీ టాక్ ను కట్టడి ఎలా చేయాలి అని ఈసినిమా దర్శక నిర్మాతలతో చర్చలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈసినిమాకు సంబంధించి సెకండ్ ఆఫ్ లో వచ్చే ఒక పాటను నిన్న రాత్రి సెకండ్ షో నుంచి తొలిగించారు అంటే ఈమూవీ పై వస్తున్న నెగిటివ్ టాక్ ఏవిధంగా ఈసినిమా నిర్మాతలతో పాటు నానీని కూడ ఏవిధంగా షేక్ చేస్తోందో అర్ధం అవుతోంది. ప్రస్తుతం నానీ క్రేజ్ పీక్ లో ఉన్న నేపధ్యంలో ఈమూవీని అత్యధిక రేట్లకు కొనుక్కున్న బయ్యర్లకు భారీ నష్టాలు ఈసినిమా ద్వారా వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏది ఎలా ఉన్నా నానీకి ఈమూవీ అనుకోని షాక్ ఇచ్చింది అనుకోవాలి..