ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ల తరువాత రామ్ చరణ్‌, అల్లు అర్జున్‌, సాయిధరమ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌, శిరీష్‌ లాంటి హీరో వచ్చారు. తాజాగా మెగాస్టార్‌ చిన్నల్లుడు కళ్యాణ్‌ను కూడా హీరోగా పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నారు. సాయిధరమ్ తేజ్ ఇప్పటికే హీరోగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. తేజు తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా త్వరలో హీరోగా మారబోతున్నాడు.
Avasarala Srinivas to direct Sai Dharam brother.
వైష్ణవ్ డెబ్యూ మూవీ కోసం అంతా సిద్ధం అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ హీరోలకు ప్రత్యేక స్థానం ఉంటుంది..డ్యాన్స్, ఫైట్స్ విషయంలో తమ సత్తా చాటుతుంటారు..అందుకే మెగా ఫ్యాన్స్ వీరిని గుండెల్లో పెట్టుకుంటారు.  రేయ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్ ఆ తర్వాత పిల్లా నువ్వు లేని జివితం సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. 

ప్రస్తుతం టాలీవుడ్ లో సాయిధరమ్ తేజ్ మినిమం గ్యారెంటీ హీరోగా మారాడు. తేజు తమ్ముడు వైష్ణవ్ నటుడిగా ఏమేరకు రాణిస్తాడో అని ఆసక్తి నెలకొని ఉంది. వైష్ణవ్ ని మొదట దిల్ రాజు లాంచ్ చేయాలని భావించాడట. కానీ ఆ అవకాశం సాయి కొర్రపాటి కి దక్కినట్లు తెలుస్తోంది.తేజు మొదటి చిత్రం రేయ్ అయినప్పటికీ, దిల్ రాజు నిర్మించిన పిల్లా నువ్వులేని జీవితం మొదట విడుదలైంది.

వైష్ణవ్ మొదటి చిత్రానికి ప్రముఖ నటుడు అవసరాల శ్రీనివాస్ దర్శత్వం వహిస్తాడని అంటున్నారు. అన్న సాయి ధరమ్ తేజ్ అయితే సినీ ఎంట్రీ ఇచ్చాక అనతి కాలంలోనే మంచి మాస్ ఫాలోవింగ్ సంపాదించాడు. డాన్సులు, ఫైట్స్‌తో ఆకట్టుకుంటూ చిరు మేనల్లుడిగా ప్రేక్షకుల వద్ద సూపర్ క్రెడిట్ కొట్టేశాడు. మరి తమ్ముడు కూడా అలాగే అలరించి క్రెడిట్ సంపాదిస్తాడా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు పట్టొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: