టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎన్నో సంచలనాలకు కేంద్ర బింధువుగా నిలిచిన నటి శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఉద్యమమే చేస్తుంది. తెలుగు అమ్మాయిలను సినిమా ఛాన్స్ లు ఇప్పిస్తామని కొందరు బడాబాబులు దారుణంగా ఉపయోగించుకుంటున్నారని..వారందరి భరతం పట్టేందుకు తాను ముందుకు వచ్చానని అంటుంది. ఇప్పటికే కొంత మంది ఫోటోలు లీక్ చేసిన శ్రీరెడ్డి తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది.
నా పేరులో 'రెడ్డి' అని ఉన్న పదాన్ని మోయడం బరువుగా అనిపిస్తోంది.. నా పేరు ఇక నుంచి శ్రీరెడ్డి కాదు శ్రీశక్తి.. నా గురించి మీడియా రాసేటప్పుడుగానీ, చదివేటప్పుడుగానీ శ్రీశక్తి అనే రాయండి, చదవండి' అని నటి శ్రీరెడ్డి పేర్కొంది. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ... 'నిర్మాత దిల్ రాజు చేతుల్లోంచి ఎప్పుడయితే థియేటర్లు బయటకు వస్తాయో అప్పటివరకు నేను శ్రీశక్తిగానే ఉంటాను.
ఎవరి దగ్గరయితే మెజారిటీ థియేటర్లు ఉండిపోయాయో వారందరి చేతుల నుంచి బయటపడాలి. నేను చేసే ఉద్యమానికి ఇంత మంది మద్దతు వస్తుందని ఊహించలేదని..ఏ అమ్మాయికైనా అన్యాయం జరిగితే..ముందు నిలదీయాలని..అక్కడే శిక్షించాలని అన్నారు.
ఇంకొంత మంది అమ్మాయిలు బయటకు వచ్చి తమ బాధలు చెప్పుకుంటున్నారు. ఓయూ విద్యార్థులను కలుపుకువెళతాము. ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా అక్కడకు వెళ్లి వారికి న్యాయం జరిగేలా చేస్తాం' అని శ్రీ రెడ్డి పేర్కొంది.