ఆపదలో ఉన్నవారి సహాయార్ధం కోసం చూస్తున్న ఆపన్నులను ఆదుకుంటు పెద్ద చారిటిగా ఎదుగుతున్న సంస్థ మనం సైతం. ఈ సంస్థ ద్వారా ఎంతో మంది ఔత్సాహిక కళాకారులకు, టెక్నీషియన్స్ కి, ఇతర జూనియర్ ఆర్టిస్టులకు ‘మనం సైతం’ సహాయం అందించింది. మనం సైతం నిర్వాహకులు కాదంబరి కిరణ్ ఒక నటుడు..నిర్మాత, దర్శకులు..అయినా కూడా సమాజసేవ చేయాలనే ధృడ సంకల్పంతో ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
కష్టం వచ్చిందని వెళితే..ఐన వాళ్లు కూడా ఆదుకోలేని పరిస్థితి ఉన్న ఈ కాలంలో ఎలాంటి సంబంధాలు లేకున్నా..ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి ముందుకు వస్తున్న గొప్ప స్వచ్ఛంద సంస్థ ‘మనం సైతం’. ఈ సంస్థ చేస్తున్న కార్యక్రమాలను మెచ్చకుంటో పలువురు సెలబ్రెటీలు సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు. గతంలో సంస్థ సేవా కార్యక్రమాల గురించి తెలిసి....మనం సైతం నిర్వాహకులు కాదంబరి కిరణ్ ను ఇంటికి ఆహ్వానించి 2 లక్షల రూపాయల విరాళాన్ని అందజేసిన చిరంజీవి...తాజాగా తన స్వదస్తూరితో ప్రశంసా పత్రాన్ని అందజేశారు.