సినిమా ఇండస్ట్రీలో ఎన్ని సినిమాల్లో నటించినా కొంత మందికి అస్సలు పేరు రాదు సరికదా..వారికి మరోసారి ఛాన్సులు కూడా రావు. కానీ ఒక్క సినిమాతో స్టార్ డమ్ సొంతం చేసుకున్న వారు చాలా అరుదుగా ఉంటారు.  ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మససు దోచి వరుస ఛాన్స్ లు కొట్టేస్తున్న హీరోయిన్లు అర్జున్ రెడ్డితో షాలినీ పాండే..ఫిదా సినిమాతో సాయి పల్లవి. 
Image result for arjun reddy
ఈ రెండు సినిమాలు గత సంవత్సరం సూపర్ హిట్ గా నిలిచాయి. అంతే కాదు ఈ రెండు సినిమాలు కూడా లో చిన్న సినిమాలు కావడం మరో విశేషం. అంతే కాదు ఈ ఇద్దరు హీరోయిన్లు తెలుగు, తమిళ ఇండస్ట్రీలో కూడా సినిమా ఛాన్సులు కొట్టేశారు.  అర్జున్ రెడ్డి సినిమాలో నటించిన షాలిని పాండేకు త్వరలో రాబోయే ‘మహానటి’ సినిమాలో సైతం మంచి క్యారెక్టర్ లభించింది.

ఈ సినిమా గనక మంచి హిట్ అయితే..ఈ అమ్మడికి మరిన్ని ఛాన్స్ లు వచ్చే అవకాశం ఉంది. ఇక సాయి పల్లవి తమిళ, మళియాళ భాషల్లో నటిస్తూ ఇప్పటికే జోరు కొనసాగిస్తుంది. తాజాగా షాలినీ పాండే..కూరగాయలు అమ్ముతూ కెమెరా కంటికి చిక్కింది. దాంతో పాపం ఈ హీరోయిన్ కి సినిమా ఛాన్సులు రావడం లేదా ఏంటీ..కూరగాయలు అమ్ముతుందని కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే అసలు విషయం తెలుసుకొని ఓహో ఓ మంచి పనికోసం షాలినీ పాండే ఇంత కష్టపడుతుందా అని మెచ్చుకుంటున్నారు.

తాజాగా షాలినీ పాండే హైద‌రాబాద్‌లోని కేపీహెచ్‌బీలోని కూర‌గాయ‌ల మార్కెట్‌లో సంద‌డి చేసింది. అక్క‌డి ఓ షాప్‌లో కొనుగోలు దారుల‌కు కూర‌గాయ‌లు అమ్మింది. `మేము సైతం` కార్య‌క్ర‌మంలో భాగంగా షాలినీ హైద‌రాబాద్‌లోని కేపీహెచ్‌బీలో ఉత్సాహంగా కూర‌గాయ‌లు విక్ర‌యించింది. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగ‌బడ్డారు. మేము సైతం కార్యక్రంలో భాగంగా ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు బయట రక రకాల పనులు చేస్తూ ఆడియన్స్ ని సంతోష పెట్టారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: