సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు భ‌ర‌త్ అనే నేను ఈ నెల 20న వ‌రల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు అన్ని ఏర్పాట్లు కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ సినిమాను ఇప్ప‌టికే మ‌హేష్ కుటుంబ స‌భ్యుల‌కు, స‌న్నిహితుల‌కు ట్ర‌య‌ల్ షోలో చూపించిన‌ట్టు తెలుస్తోంది. ఈ షోపై ఇండ‌స్ట్రీలోనూ చ‌ర్చ స్టార్ట్ అయ్యింది. ఈ టాక్ ప్ర‌కారం రిపోర్టులు అన్ని టెర్రిఫిగా ఉన్నాయి.

Image result for bharath ane nanu stills

మ‌హేష్‌బాబు కెరీర్‌లోనే భ‌ర‌త్ బెస్ట్ మూవీ అవుతుందంటున్నారు. పొలిటిక‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో సీఎం రోల్‌లో మ‌హేష్ ఇర‌గ‌దీశాడంటున్నారు. పాలిటిక్స్ అంటే ఆమ‌డ దూరంలో ఉండే మ‌హేష్ ఈ సినిమాలో భ‌ర‌త్ అనే సీఎం రోల్‌లో పెర్పామెన్స్ సూప‌ర్బ్‌గా ఉంద‌ని చెపుతున్నారు. సినిమాలో మహేష్ బాబు సరికొత్త పెర్ఫార్మెన్స్ చూడబోతున్నామని, ఆయన కెరీర్లోనే ది బెస్ట్ అనే విధంగా ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేశాడని టాక్.

Related image

ఇక ఇప్ప‌టికే హ్యాట్రిక్ హిట్ల‌తో ఉన్న ద‌ర్శ‌కుడు కొర‌టాల ఈ సినిమాతో మ‌రోసారి క‌ట్టిప‌డేసే క‌థ‌, క‌థ‌నాల‌తో పాటు త‌న రైటింగ్ స్కిల్‌తో మెస్మ‌రైజ్ చేశాడ‌ని... సినిమాను సెకండాఫ్‌లో చాలా ఉత్కంఠంగా ప్ర‌జెంట్ చేశాడ‌ని చెపుతున్నారు. కొర‌టాల బేసిగ్గా స్క్రిఫ్ట్ రైట‌ర్ కావ‌డంతో ఆ ప‌దును ఇక్క‌డ చూపించాడంటున్నారు.

Image result for bharath ane nanu stills

అన్ని కార్య‌క్ర‌మాలు కంప్లీట్ చేసుకోవ‌డంతో ఇప్పుడు భ‌ర‌త్‌కు సెన్సార్ టెన్ష‌న్ ఒక్క‌టే ఉంది. వాస్త‌వానికి రెండు రోజుల క్రిత‌మే సెన్సార్ కంప్లీట్ చేసుకోవాల్సిన ఈ సినిమా సోమ‌వారం సెన్సార్‌కు వెళుతోంది. సోమ‌వారం ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు కంప్లీట్ చేసేందుకు నిర్మాత దాన‌య్య అన్ని కార్య‌క్రమాలు కంప్లీట్ చేశారు. సెన్సార్ రిపోర్ట్ కూడా పాజిటివ్‌గా వ‌స్తే భ‌ర‌త్‌కు ఇక తిరుగు ఉండ‌క‌పోవ‌చ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: