బుల్లితెరపై ఇప్పుడు ‘జబర్ధస్త్’ కామెడీ షోకి ఎంత క్రేజ్ ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. విదేశాల్లో సైతం తెలుగు ప్రేక్షకులు ‘జబర్ధస్త్’ కామెడీ షో కి మంచి ఫ్యాన్స్ అయ్యారు. ‘జబర్ధస్త్’ కామెడీ షో తో ఎంతో మంది ఔత్సాహికులు ఇప్పుడు మంచి పొజీషన్లోకి వచ్చారు. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు జబర్ధస్త్ కమెడియన్ల హవా నడుస్తుంది. అంతే కాదు ఈ ప్రోగ్రామ్ తో ఇద్దరు యాంకర్లు అనసూయ, రష్మి సినిమాల్లో చాన్సులు దక్కించుకున్నారు. ఈ మద్య విడుదలైన ‘రంగస్థలం’ చిత్రంలో అనసూయ ‘రంగమ్మత్త’గా నటించి మంచి మార్కులే కొట్టేసింది.
ఇక ‘జబర్ధస్త్’ కామెడీ షో పై ఇప్పటి వరకు ఎన్నో వివాదాలు వచ్చాయి..కానీ ఈ కామెడీ షో మాత్రం ఎక్కడా తగ్గకుండా పాపులారిటీ బాగానే పెంచుకుంటుంది. ‘జబర్ధస్త్’ కామెడీ షో అంటే ఇప్పుడు వెంటనే గుర్తుకు వచ్చేది హైపర్ ఆది. మనోడు వేసే పంచ్ లకు ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటారు. తక్కువ టైమ్ లో టీమ్ లీడర్ గా ఎదిగిన హైపర్ ఆది ప్రస్తుతం కొన్ని చిత్రాల్లో కూడా నటిస్తున్నాడు. ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆది..ఎవరినైనా సరే ఏడిపించడం చాలా తేలిక .. కానీ నవ్వించడం మాత్రం చాలా కష్టం.
అలాంటిది అందరినీ నవ్వించే శక్తిని దేవుడు నాకిచ్చాడు. అందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను .. ఆదరణ లభిస్తున్నందుకు ఆనందిస్తున్నాను" అన్నారు. నేను ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చాను.. మద్యతరగతి కుటుంబీకుల కష్టాలు సుఖాలు అన్నీ నాకు తెలుసు. 'జబర్దస్త్' లోకి అదిరే అభి వల్ల వచ్చారు..అదృష్టం కలిసి వచ్చి తర్వాత టీమ్ లీడర్ ని అయ్యాను. నా కామెడీ టైమింగ్ అందరికీ నచ్చింది..అందుకే నన్ను ఆదరిస్తున్నారని అన్నారు.
ఇంతవరకూ 'జబర్దస్త్'లో 100 స్కిట్లు పూర్తి చేశాను. రచన వైపు .. నటన వైపు రావడానికి ముందు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా రెండు సంవత్సరాలు పనిచేశాను. సంవత్సరానికి నాకు ఐదు లక్షలు వస్తున్నా..జీవితంలో ఇంకా ఏదైనా సాధించాలని ఉత్సాహంతో ఈ రంగంలోకి వచ్చానని అన్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా జనం నన్ను గుర్తుపడుతున్నారు .. అది నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది" అంటూ చెప్పుకొచ్చాడు.