జబర్ధస్త్ కామెడీ షో తో బాగా పాపులర్ అయిన యాంకర్ అనసూయ ఈ మద్య సుకుమార్,రాంచరణ్ నటించిన ‘రంస్థలం’ సినిమాలో ‘రంగమ్మత్త’గా నటించి మెప్పించింది. ఎప్పుడూ గ్లామర్ గా కనిపించే అనసూయ ఈ సినిమాలో 1985 కాలం నాటి గ్రామీణ వాతావరణంలో మహిళ ఎలా ఉంటుందో అలాంటి పాత్రలో జీవించారు. ఒకదశలో చెప్పాలంటే..ఈ సినిమాలో చిట్టిబాబు, రామలక్ష్మి ల తర్వాత అంతగా ఆకట్టుకున్న పాత్ర రంగమ్మత్తది కావడం విశేషం.
జబర్థస్త్ కామెడీ షో చాలా హాట్ హాట్ గా కనిపించే అనసూయనేనా ఈ పాత్రలో కనిపించిందని అందరూ ఆశ్చర్యపోయారు. న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించి సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన అనసూయకు అప్పట్లో పెద్దగా పేరు రాలేదు. కానీ జబర్థస్త్ కామెడీ షోలో యాంకర్ గా వచ్చిన తర్వాత చాలా హాట్ హాట్ గా దర్శనమివ్వడంతో అందరి చూపు అనసూయ పై పడింది.
దాంతో అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. జబర్థస్త్ ప్రోగ్రామ్ తర్వాత అనసూయ వివిధ ఛానల్స్ లో యాంకర్ గా వ్యవహరిస్తుంది..ప్రైవేట్ ప్రోగ్రామ్స్ లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది. తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తనపై గత కొంత కాలంగా రక రకాలు విమర్శలు వస్తున్నాయని..ఇద్దరు బిడ్డలకు తల్లివి... హాట్ యాంకర్లా టీవీల్లో కనిపించడం, ఐటమ్ సాంగ్స్ చెయ్యడం నీకు అవసరమా అని చాలామంది నెటిజన్లు నన్ను విమర్శిస్తున్నారని వాపోయింది.
ఇద్దరు బిడ్డల తల్లినైతే ఏంటి? వైవిధ్యభరితమైన పాత్రలు వచ్చినపుడు నటించకూడదా? అంటూ ప్రశ్నిస్తోంది. బాలీవుడ్లో పెళ్లై పిల్లలున్న తారలు ఇప్పటికీ తెరపై అలరిస్తున్నారు. ఒక్క తెలుగు కథానాయికలపైనే ఈ విమర్శలు. ఒకప్పటి అగ్ర తారలైన భానుమతిగారు, సావిత్రిగారు పెళ్లయిన తర్వాత కూడా కెరీర్ను అద్భుతంగా సాగించిన వారు కాదా అన్ని ప్రశ్నించారు. అప్పుడులేని విమర్శలు ఇప్పుడు ఎందుకు? వైవిధ్యమైన పాత్రలు దక్కినప్పుడు చేస్తే తప్పేంటి?’’ అని అనసూయ చెప్పుకొచ్చింది.