గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై దుమారం రేపుతున్న శ్రీశక్తి(శ్రీరెడ్డి) తాజాగా పవన్ కళ్యాన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈమె కాదు కొంత మంది జూనియర్ ఆర్టిస్టులు సైతం పవన్ కళ్యాన్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటంతో ఫ్యాన్స్ తమ ప్రతాపాన్ని చూపించారు. దాంతో దెబ్బకు దిగి వచ్చిన వాళ్లంతా..సారీ చెబుతూ..ఏదో ఆవేశంలో మాట్లాడాం..పవన్ గారికి..ఫ్యాన్స్ కి మా క్షమాపణలు అన్నారు.
నటి అపూర్వ సైతం తమ ఆర్టిస్టులు ఆవేశంలో అన్న విషయలు పవన్..ఫ్యాన్స్ పట్టించుకోవొద్దని..ఆయన గొప్ప వ్యక్తి అని..ఆనందాలు అన్నీ వదిలి ప్రజల్లోకి వచ్చారని..అలాంటి వ్యక్తి గురించి ఎవరు తప్పు మాట్లాడినా ఖండిస్తానని అన్నారు అపూర్వ. టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిన కాస్టింగ్ కౌచ్ వివాదం తారా స్థాయికి చేరిన వేళ సీని పెద్దలుపై చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు.మరికొందరు ఒక అడుగు ముందుకేసి టాలీవుడ్ టాప్ హీరోలపై ఆరోపణలు చేశారు.
ఈ క్రమంలో గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారాయి. తాజాగా నటి శ్రీరెడ్డి పవన్ కల్యాణ్ పై చేసిన వ్యాఖ్యలకు మెగా హీరో వరుణ్ తేజ్ స్పందించాడు. ఫేస్ బుక్ లో ‘‘నీ గురించి విమర్శంచి, నిన్ను తక్కువ చేసి చూపించాలని ప్రయత్నించే నీచ మనస్కుల గురించి పట్టించుకోనవసరం లేదు. అలాంటి వారు వారి బలహీనతలను తెలుసుకోలేరు.
వాళ్ల తప్పుల్ని వాళ్లు తెలుసుకోవడం కన్నా ఎదుటి వారిని తప్పుడు వ్యక్తులుగా చూపించడంలోనే ఎక్కువ ఉత్సుకత ప్రదర్శిస్తారు’’ అంటూ దిమ్మదిరిగే పోస్టు పెట్టారు. దీనికి మెగా అభిమానుల నుంచి మద్దతు లభిస్తోంది. వరుణ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన బాబాయ్ పవన్ మీద చేసిన కామెంట్స్కి రియాక్ట్ అయ్యాడా! లేక కత్తి మహేష్ తన పెదనాన్న ప్రోడక్షన్ మీద కేసు పెడతాను అన్న దాని మీద రియాక్ట్ అయ్యాడో మెగా అభిమానులకు అర్థం కావడం లేదు.