డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా లాంచ్ అవుతున్న విషయం తెలిసిందే. 1971 లో జరిగిన ఇండియా పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమకథగా పూరి ఈసినిమాను తీస్తున్నాడు. 'మెహబూబా' అనే టైటిల్ తో ఈమూవీ మే 11న సమ్మర్ స్పెషల్గా రాబోతోంది. నేహా శెట్టి హీరోయిన్గా ఈమూవీలో ఆకాష్ పక్కన నటిస్తోంది. దిల్రాజు తన వెంకటేశ్వర ఫిలింస్ ద్వారావిడుదల చేయబోతున్న ఈమూవీ ప్రెస్ మీట్ ఈమధ్య జరిగింది.
ఈప్రెస్ మీట్ లో ఆకాష్ పూరి ఉద్వేగ పూరితంగా చేసిన కామెంట్స్ వెనుక ఆంతర్యం ఎమిటి అన్న కోణంలో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. ఈసినిమా చాలబాగా వచ్చింది సూపర్ హిట్ అవడం ఖాయం అంటూ ఆకాష్ ఈమూవీ తన లాంచింగ్ సినిమా కాదని తాను తనతండ్రి పూరిజగానాథ్ ను తిరిగి ఈసినిమా ద్వారా లాంచ్ చేస్తున్నాను అని అనడంతో ఆకార్యక్రమానికి వచ్చిన అతిధులతో పాటు మీడియావర్గాలు కూడ షాక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన టీజర్ అదేవిధంగా ట్రైలర్ కు వచ్చిన స్పందన చూసి దిల్ రాజ్ ఈసినిమా రైట్స్ తీసుకుని మనతెలుగు రాష్ట్రాలలో భారీ స్థాయిలో విడుదలచేయడానికి నిర్ణయం తీసుకోవడంతో ఈమూవీ పై మరింత అంచనాలు పెరిగాయి. ఇండో పాకిస్తాన్ బోర్డర్ ప్రాంతాలలో చలికాలంలో ఉండే అత్యంత వ్యతిరేక వాతావరణ పరిస్తుతులను లెక్కచేయకుండా పూరి జగన్నాథ్ చాలా కసిగా ఈసినిమాను తీసాడు అని వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం పూరి జగన్నాథ్ క్రియేటివ్ టీమ్ లో ఉన్న హీరోయిన్ ఛార్మీ కూడ ఈసినిమా గురించి చాలా కష్టపడినట్లుతెలుస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంతున్న ఈసినిమా విజయం ఈ సినిమా ద్వారా హీరోగా పరిచియం అవుతున్న ఆకాష్ కంటే పూరీకి కీలకంగా మారడంతో ఉద్వేగంలో ఆకాష్ పూరి తన తండ్రి పై ఇలాంటి కామెంట్స్ చేసి ఉంటాడు అనుకోవాలి. వరస పరాజయాలతో సతమతమై పోతున్న పూరీని ఆకాష్ ఈ సమ్మర్ రేస్ లో ఎలా నిలపెడతాడో వచ్చే నెలలో తేలి పోతుంది..