సినీ పరిశ్రమలో తెలుగు వారికి అవకాశాలు, కాస్టింగ్ కౌచ్ అంశంపై పోరాటం చేస్తున్న శ్రీరెడ్డి మహిళా సంఘాలతో కలిసి సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తమ పోరాటాన్ని పట్టించుకోని ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించింది. ఇండస్ట్రీని ఏలుతున్న నాలుగు కుటుంబాలను టార్గెట్ చేస్తూ ఈ సందర్భంగా ఆమె విమర్శలు గుప్పించింది. ఈ సందర్భంగా ఆమె మంచు లక్ష్మి, పవన్ కళ్యాణ్‌ పేర్లను ప్రస్తావిస్తూ పలు సంచలన కామెంట్స్ చేసింది. 

అంతే కాదు పవన్ కళ్యాన్ హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ ! నువ్వు ప్రజానాయకుడివి అయి ఉండి ఏం మాట్లాడుతున్నావు? పోలీస్ స్టేషన్ కు వెళ్లమని చెబుతున్నావు? నువ్వు చెప్పాలి నాకు సలహా! ‘పవన్ కల్యాణ్ అన్న’ అన్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకుంటున్నా.

ఇకపై పవన్ కల్యాణ్ ని ఏ అమ్మాయి కూడా ‘అన్న’ అనొద్దు..’ అంటూ రాయడానికి వీలులేని భాషలో పవన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీనిపై ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి పై తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం పోలీస్ స్టేషన్‌లో జనసేన కార్యకర్తలు ఫిర్యాదు చేశారు.
Image result for sri reddy pawan kalyan comments
అంతేగాక పవన్ కళ్యాణ్ తల్లినుద్దేశించి కూడా శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసారని , వెంటనే ఆమె ఫై చర్యలు తీసుకోవాలంటూ పిర్యాదు లో పేర్కొన్నారు. పిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యప్తు చేపడతామని హామీ ఇచ్చారు.మరోపక్క యావత్ తెలుగు రాష్ట్రలొ ఇప్పుడు ఇదే చర్చ జరుగుతుంది..అభిమానులు పెద్ద ఎత్తున శ్రీ రెడ్డి ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మొన్నటి వరకు ఆమెను సపోర్ట్ చేసిన చాలామంది ఆమెను వ్యతిరేకిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: