మహేష్ బాబు సినిమా కు కొంచెం నెగటివ్ టాక్ వస్తే చాలు. సోషల్ మీడియాలో ఆ సినిమా గురించి దారుణంగా ప్రచారం చేస్తారు. లాస్ట్ మూవీ స్పైడర్ విషయం లో కూడా ఇదే జరిగింది. ఈ సినిమా నిజంగా బాగా లేక పోయిన ఈ సినిమా గురించి సోషల్ మీడియా లో జరిగిన రచ్చ ఇంకా ఏ సినిమా లో జరగలేదని చెప్పవచ్చు. ఇది ప్రధానంగా ఎన్టీఆర్ అభిమానులే చేశారని మహేష్ కూడా నమ్మాడని వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులను కూడా బుజ్జగించారు. 

Image result for bharath anu nenu

రామ్ చరణ్ ఫ్యాన్స్ ను బుజ్జగించడానికి అన్నట్లు అతగాడితో పార్టీ చేసుకుని ఫొటోలు దిగారు. సోషల్ నెట్ వర్క్ కోసం ఓ గట్టి టీమ్ ను సెట్ చేసుకున్నారు.  అంతా బాగానే వుంది. కానీ మళ్లీ మహేష్ సినిమా టార్గెట్ అవుతున్నట్లే కనిపిస్తోంది. ఎందుకంటే ట్విట్టర్ లో, ఫేస్ బుక్ లో భరత్ సెన్సారు టాక్ అంటూ కాస్త గట్టిగానే పోస్ట్ లు కనిపిస్తున్నాయి.మరోపక్క రామ్ చరణ్ రంగస్థలం ఓ కొత్త రికార్డు సృష్టించింది. నాన్ బాహుబలి రికార్డు తమదే అని ప్రకటించింది.

Image result for bharath anu nenu

ఈ రికార్డు మరీ పదిరోజుల్లో బ్రేక్ కాకూడదని రామ్ చరణ్ ఫ్యాన్స్ కోరుకోవడం సహజం. కానీ భరత్ అనే నేను బ్రేక్ ఈవెన్ అయింది అంటే, రంగస్థలం రికార్డు పోయినట్లే అందువల్ల మారుతున్న ట్రెండ్ లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో భరత్ అనే నేను సినిమాను నిలబెట్టగలగింది సినిమా క్వాలిటీ మాత్రమే. అయితే సినిమా క్వాలిటీ కాస్త అటు ఇటుగా వుంటే మాత్రం, అభిమానులు, సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా వుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: