ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ ప్రొడ్యూసర్స్ లిస్టులో డివివి దానయ్య ప్రధమ స్థానంలో కొనసాగుతున్నాడు. ఈవారం విడుదల కాబోతున్న ‘భరత్ అనే నేను’ మూవీ నుండి త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న రాజమౌళి జూనియర్ చరణ్ ల మల్టీ స్టారర్ వరకు ఎన్నో భారీ చిత్రాలను తీస్తున్న దానయ్య ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ మల్టీ స్టారర్ పై కొన్ని ఆసక్తికర లీకులు ఇచ్చాడు.
RAJAMOULI MULTISTARRER WITH CHARAN AND JR PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈసినిమా కథను పూర్తిగా రాజమౌళి తనకు చెప్పాడని అదేవిధంగా ఈకథను జూనియర్ ఎన్టీఆర్ లకు కూడ పూర్తిగా వివరించాడని అయితే ఎక్కడ లీకులు వస్తాయో అన్న భయంతో ఈసినిమా కథ గురించి రహస్యం కొనసాగిస్తున్నామన్న విషయాన్ని బయటపెట్టాడు దానయ్య. అంతేకాదు ఈ సినిమా బడ్జెట్ 300 కోట్లు అంటూ ఈమూవీ బడ్జెట్ పై మరింత అంచనాలు పెంచేస్తున్నాడు దానయ్య.
సంబంధిత చిత్రం
ఇదే సందర్భంలో దానయ్య ఈమూవీకి సంబంధించిన మరో లీకు కూడ ఇచ్చాడు. ఈమూవీ షూటింగ్ ఈఏడాది అక్టోబర్ లో ప్రారంభం అయిన తరువాత ఒక సంవత్సరం పాటు ఏకధాటిగా ఈమూవీ షూటింగ్ నడుస్తుందని ఆతరువాత ఈమూవీ గ్రాఫిక్ వర్క్స్ పై సుమారు ఆరు నెలలు పనిచేయవలసి వస్తుంది అన్న విషయాలను బయటపెట్టాడు. దీనితో రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ విడుదల 2020 సమ్మర్ లో మాత్రమే అన్న వ్యూహాత్మక లీకులు దానయ్య ఇంటర్వ్యూ ద్వారా వెలువడుతున్నాయి. 
RAJAMOULI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అంతేకాదు రాజమౌళి సూచనలతో ఈసినిమాకు సంబంధించిన ఆర్ట్ డిపార్ట్ మెంట్ ఈమూవీకి సంబంధించిన భారీ సెట్స్ డిజైన్స్ వేయడంలో బిజీగా ఉన్న విషయాలను కూడ దానయ్య లీకులు ఇచ్చాడు. ఈ ప్రముఖ నిర్మాత ఇస్తున్న లీకులను బట్టి చూస్తుంటే జూనియర్ చరణ్ లు సుమారు ఏడాదిన్నర పాటు రాజమౌళి బందిఖానాలో బందీలుగా మారిపోవడం ఖాయం అని అనిపిస్తోంది. ‘బాహుబలి’ స్థాయిలో ఒక అద్భుతమైన విజువల్ వండర్ గా ఈ మల్టీ స్టారర్ ఉండబోతోంది అని వస్తున్న వార్తలను బట్టి ఈమూవీ బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల స్థాయిలో జరిగినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: